కృష్ణం రాజు కూతుళ్ల పరిస్థితి ఏంటి? ఆ బాధ్యత ప్రభాస్ దేనా.!

First Published Sep 11, 2022, 1:38 PM IST

రెబల్ స్టార్ కృష్ణం రాజు (Krishnam Raju) అనారోగ్యంతో కన్నమూయడంతో సినీ ప్రముఖులు, అభిమానులు, కుటుంబ సభ్యులు తీవ్రంగా చింతిస్తున్నారు.  అయితే కృష్ణం రాజు కూతుర్ల విషయంలో పూర్తి చేయాల్సిన బాధ్యతలు మిగిలే ఉండటం గమనార్హం.
 

ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు గ్రామంలో ఉప్పలపాటి వీర వెంకట సత్యనారాయణ రాజుకు ఉప్పలపాటి వెంకట కృష్ణం రాజు 20 జనవరి 1940న జన్మించారు. 23వ ఏటా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. కృష్ణం రాజు మొదట సీతాదేవిని వివాహం చేసుకున్నాడు. తరువాత 20 సెప్టెంబర్ 1996న శ్యామలా దేవిని పెళ్లి చేసుకున్నారు. నటుడిగా, సినీ నిర్మాతగా, పొలిటీషన్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే కృష్ణం రాజు - శ్యామలా దేవికి ముగ్గురు కూతుర్లు ఉన్నారు. వీరికి ఇంత వరకు పెళ్లి కాలేదు. తమ కేరీర్ లో మంచి పోజిషిన్ కు చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 

కృష్ణం రాజు భార్య పేరు శ్యామలా దేవి.  ప్రసీద, ప్రకీర్తి, ప్రదీప్తి అనే ముగ్గురు కూతుర్లు ఉన్నారు. ఈయనకు కొడుకులు లేని లోటును అలు ప్రభాస్, సిద్ధార్థ్ తీర్చారు. పెద్దమ్మాయి లండన్ లో ఎంబీఏ చేసింది. రెండేండ్ల కిందనే యూఎస్ఏలోని లాస్ ఏంజెల్స్ లో ప్రొడక్షన్ కోర్సును పూర్తి చేసింది. ప్రస్తుతం గోపీ క్రిష్ణ మూవీస్ ప్రొడక్షన్ కంపెనీ బాధ్యతలను చూస్తున్నట్టు  తెలుస్తోంది. 

ఇక రెండో కూతురు సాయి ప్రకీర్తి. ఈమె హైదరాబాద్ లోని జేఎన్టీయూలోనే ఆర్కిటెక్చర్ కోర్సు చదువుతోంది. పెయింటింగ్, డ్రాయింగ్ పైనా ఈమెకు మంచి పట్టుంది. మూడో అమ్మాయి ప్రదీప్తి సైకాలాజీ పూర్తి చేసినట్టు సమాచారం. అయితే ఇప్పటి వరకు కృష్ణం రాజు కూతుర్లు తమంతటా తామే జీవితంలో నిలవాలని భావించారు. దీంతో ఇప్పటివరకు పెళ్లిళ్లు చేసుకోలేదు. 
 

ఇదే సమయంలో తాజాగా కృష్ణం రాజు కూడా మరణించడంతో ఇక వారి పరిస్థితి కాస్తా ఆందోళనకరంగా మారింది. దీంతో అన్న ప్రభాస్ (Prabhas) పైనే వీరి పెళ్లిళ్లు, మిగితా భవిష్యత్ కు సంబంధించిన బాధ్యత పడింది. ఇప్పటికే కృష్ణం రాజు ప్రభాస్ పెళ్లి చేయాలని చాలా ప్రయత్నించాడు. కానీ కుదరలేదు. చివరిగా డార్లింగ్ పెళ్లి చూడకుండానే కన్నుమూశారు. దీంతో ప్రభాస్ తన పెళ్లితో పాటు.. కృష్ణం రాజు కూతుళ్ల పెళ్లి బాధ్యతలను మోయాల్సి వస్తోంది.
 

కృష్ణం రాజు మరణవార్త విన్నాక సినీ తారలు ఆయన నివాసంలోని పార్థివ దేహాన్ని సందర్శిస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్, వడ్డే నవీన్, మురళీ మోహన్, నరేష్, మంచు విష్ణు, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తదితరులు కృష్ణం రాజు పార్థిక దేహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు.

click me!