సౌందర్య మరణం, రజినీకాంత్ భయపడి హిమాలయాలకు వెళ్ళారా.. సరిగ్గా రిలీజ్ కి ముందే వారిద్దరూ..

Published : Aug 28, 2025, 07:13 PM IST

సౌందర్య మరణించిన తర్వాత రజినీకాంత్ విషయంలో ఊహించని పుకార్లు మొదలయ్యాయి. అసలేం జరిగింది, ఆ పుకార్లు ఎందుకు వచ్చాయి అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 

PREV
15

చిత్ర పరిశ్రమలో చాలా పుకార్లు వినిపిస్తుంటాయి. అదే విధంగా నటీనటులకు, దర్శకులకు, నిర్మాతలకు చాలా సెంటిమెంట్లు ఉంటాయి. తమ విశ్వాసాలకు అనుగుణంగా నడుచుకునే హీరోలు, నిర్మాతలు ఉన్నారు. గతంలో సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి కొన్ని సంచలన పుకార్లు వినిపించాయి. చంద్రముఖి చిత్రం తర్వాత ఈ పుకార్లు వ్యాపించాయి.

25

చంద్రముఖి చిత్రం ముందుగా మలయాళంలో తెరకెక్కింది.ఆ తర్వాత 2004లో ఈ చిత్రాన్ని కన్నడలో ఆప్తమిత్ర పేరుతో రీమేక్ చేశారు. ఈ చిత్రంలో చంద్రముఖి పాత్రలో సౌందర్య నటించారు. ప్రధాన పాత్రలో కన్నడ స్టార్ విష్ణువర్ధన్ నటించారు. ఈ చిత్ర షూటింగ్ పూర్తయ్యాక రిలీజ్ కి కొన్ని నెలల ముందు సౌందర్య హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే.

35

ఆ తర్వాత 2005లో సూపర్ స్టార్ రజినీకాంత్, జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రల్లో తమిళంలో చంద్రముఖి చిత్రం తెరకెక్కింది. ఈ మూవీ సూపర్ హిట్ అయింది. కానీ ఈ చిత్రం తర్వాత రజనీకాంత్ కి అనారోగ్య సమస్యలు మొదలయ్యాయని పుకార్లు వచ్చాయి. ఆప్తమిత్ర తర్వాత సౌందర్య మరణించడంతో.. రజినీకాంత్ విషయంలో కూడా రూమర్స్ క్రియేట్ చేశారు.

45

2009లో విష్ణువర్ధన్ ఆప్త మిత్ర చిత్రానికి సీక్వెల్ గా ఆప్తరక్షక్ అనే చిత్రంలో నటించారు. ఇది కూడా చంద్రముఖి పాత్ర ఆధారంగా రూపొందించిన చిత్రమే. ఈ చిత్ర షూటింగ్ పూర్తయ్యాక రిలీజ్ కి కొన్ని నెలల ముందు హీరో విష్ణువర్ధన్ మరణించారు. సౌందర్య, విష్ణువర్ధన్ మరణాలకు కారణం చంద్రముఖి అంటూ పుకార్లు ఎక్కువయ్యాయి. ఈ పుకార్లు ఆప్తరక్షక్ చిత్ర పబ్లిసిటీకి బాగా ఉపయోగపడ్డాయి. సినిమాలో కంటెంట్ అంత బాగాలేకపోయినప్పటికీ పుకార్ల వల్ల వచ్చిన పబ్లిసిటీతో సినిమా సూపర్ హిట్ అయింది.

55

ఆ సమయంలో రజనీకాంత్ కుటుంబ సభ్యుల సలహాతో మైసూరులో మహా హోమం చేయించారని, హిమాలయాలకు వెళ్లి పూజలు కూడా చేశారని వార్తలు వచ్చాయి. చంద్రముఖి ఆత్మ గురించి వచ్చిన వార్తలు మొత్తం అవాస్తవాలే అని ఆప్త మిత్ర చిత్రానికి పనిచేసిన డ్యాన్స్ కొరియోగ్రాఫర్ స్వర్ణ మాస్టర్ తేల్చేశారు. మేమంతా ఆ చిత్రానికి పనిచేశాం కదా.. మేము బాగానే ఉన్నాం. కొన్ని సంఘటనలు జరిగాయి కాబట్టి ఈ రూమర్స్ వచ్చాయి. అంతే కానీ అందులో ఎలాంటి వాస్తవం లేదని స్వర్ణ మాస్టర్ క్లారిటీ ఇచ్చారు. ఆప్త రక్షక్ చిత్రాన్ని తెలుగులో నాగవల్లి పేరుతో వెంకటేష్ హీరోగా రీమేక్ చేశారు. ఈ మూవీ డిజాస్టర్ అయింది.

Read more Photos on
click me!

Recommended Stories