అప్పుడే పూరి జగన్నాధ్ పనైపోయింది అన్నారు, కానీ కొడితే దెబ్బకి బాక్సాఫీస్ షేక్.. స్టార్ డైరెక్టర్ కామెంట్స్..

Published : Aug 14, 2024, 06:06 PM ISTUpdated : Aug 14, 2024, 06:12 PM IST

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తెరకెక్కించిన డబుల్ ఇస్మార్ట్ చిత్రం మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. లైగర్ చిత్రంతో పూరి జగన్నాధ్ కి ఎదురుదెబ్బ తగిలింది. ఆ గాయాన్ని డబుల్ ఇస్మార్ట్ చిత్రం మానేలా చేస్తుంది అని అంతా భావిస్తున్నారు.

PREV
15
అప్పుడే పూరి జగన్నాధ్ పనైపోయింది అన్నారు, కానీ కొడితే దెబ్బకి బాక్సాఫీస్ షేక్.. స్టార్ డైరెక్టర్ కామెంట్స్..

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తెరకెక్కించిన డబుల్ ఇస్మార్ట్ చిత్రం మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. లైగర్ చిత్రంతో పూరి జగన్నాధ్ కి ఎదురుదెబ్బ తగిలింది. ఆ గాయాన్ని డబుల్ ఇస్మార్ట్ చిత్రం మానేలా చేస్తుంది అని అంతా భావిస్తున్నారు. పూరి జగన్నాధ్, రామ్ పోతినేని వెండితెరపై చేసే మ్యాజిక్ పైనే అంతా ఆధారపడి ఉంటుంది. 

25

అయితే ఇలాంటి ఎదురుదెబ్బలు పూరి జగన్నాధ్ కి కొత్తేమి కాదు. లైగర్ చిత్రంతో పూరి జగన్నాధ్ పై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. పూరి పనైపోయింది అని అంతా అన్నారు. దీనిపై స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. వివి వినాయక్ మాట్లాడుతూ.. పూరిని కామెంట్ చేసే వాళ్లంతా ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తుంటారు. 

35

కానీ పూరి స్టామినా ఏంటో నాకు తెలుసు. కరెక్ట్ స్క్రిప్ట్ తో వస్తే పూరి జగన్నాధ్ ని మించినోడు లేడు. పూరి అంటే నాకు చాలా ఇష్టం. లైగర్ మాత్రమే కాదు.. అంతకు ముందు చాలా సార్లు పూరి జగన్నాధ్ గురించి ఇలాంటి కామెంట్స్ వచ్చాయి. పోకిరికి ముందు పూరి పనైపోయింది అన్నారు. 

45

పోకిరి చిత్రానికి ముందు.. ఆంధ్రావాలా, 143 లాంటి ఫ్లాప్ చిత్రాలు ఎదురయ్యాయి. హిందీలో ఒక చిత్రంకి చేస్తే అది కూడా డిజాస్టర్. సూపర్ మూవీ యావరేజ్ గా నిలిచింది. దీనితో పూరి పనైపోయింది అని అన్నారు. కానీ పోకిరి చిత్రంతో కొడితే బాక్సాఫీస్ షేక్ అయింది. ఇప్పటికి నాకు బెస్ట్ స్క్రిప్ట్ అనిపించే చిత్రం పోకిరి అని వివి వినాయక్ అయ్యారు. 

55

పోకిరి కన్నా బాగా డబ్బు తెచ్చిపెట్టిన చిత్రాలు ఉండొచ్చు. కానీ అలాంటి మెస్మరైజింగ్ స్క్రిప్ట్ మరొకటి లేదు అని అన్నారు. పూరి జగన్నాధ్ తప్పకుండా కంబ్యాక్ అవుతాడని వివి వినాయక్ అన్నారు. 

click me!

Recommended Stories