యాక్షన్ హీరోగా విశాల్ తనకంటూ ఓ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. 'తిమిరు', 'సండక్కోళి', 'తుప్పరివాలన్', 'ఇరుంబుతిరై' లాంటి ఎన్నో సినిమాలతో కమర్షియల్ హీరోగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. ఈ క్రమంలో, నటనతో పాటు తొలిసారిగా దర్శకత్వ బాధ్యతలు చేపట్టి విశాల్ రూపొందించిన చిత్రమే 'మకుటం'. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచే విశాల్ అభిమానుల్లో అంచనాలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఇందులో ఆయన ద్విపాత్రాభినయం చేయడం మరింత ఆసక్తిని పెంచింది.
గత ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైన 'మకుటం' చిత్రంలో విశాల్తో పాటు అంజలి, తుషార విజయన్, జాన్ విజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. విడుదల తర్వాత ఈ సినిమాకు అనుకున్న స్థాయిలో స్పందన రాలేదు. ముఖ్యంగా సినిమా నిడివి, వివిధ కాలాల్లో సాగే కథ, కొన్నిచోట్ల నెమ్మదిగా సాగే స్క్రీన్ప్లే వంటివి విమర్శలకు గురయ్యాయి. సుమారు 3 గంటల 5 నిమిషాల నిడివి ఉన్న ఈ కథను ఇంకా క్లుప్తంగా, వేగంగా చెప్పి ఉండవచ్చని అభిమానులు, విమర్శకులు అభిప్రాయపడ్డారు.