గణేష్ చతుర్థి యూత్ కి ఇష్టమైన పండగ. మండపం నిర్మించి, వినాయక విగ్రహం ఏర్పాటు చేస్తారు. దీనికి అవసరమైన ఖర్చుల కోసం తమ ఏరియాలో చందాలు వసూలు చేస్తారు. ఉదయం, సాయంత్రం పూజలు నిర్వహించి ప్రసాదాలు వడ్డిస్తారు. గణేష్ మండపం వద్ద కమిటీ కుర్రాళ్ళు అందరూ చేరి ముచ్చట్లు పెడతారు.
ప్రతి విషయంలో మిగతా వాళ్ళ కంటే గొప్పగా వినాయక చవితి వేడుకలు నిర్వహించాలని పోటీపడతారు. అందుకే వినాయక విగ్రహాలను ప్రత్యేకంగా రూపొందిస్తారు. తాజాగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేసిన పనికి జనాలు అవాక్కు అయ్యారు. అల్లు అర్జున్ తో పాటు ఆయన హీరోయిన్ రష్మిక మందానను కూడా వినాయకుడు విగ్రహ రూపంలో జోడించారు.