శృతి మించుతున్న ఎన్టీఆర్, రాంచరణ్ ఫ్యాన్స్.. తగలబెట్టేశావు కదయ్యా విజయేంద్ర ప్రసాద్

First Published Jan 25, 2024, 10:58 AM IST

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇద్దరు స్టార్ హీరోలు కలసి మల్టీస్టారర్ చిత్రంలో నటించడం గగనం అయిపోతోంది. ఒక వేళ నటించినా మా హీరో గొప్ప అంటే మా హీరోనే గొప్ప అంటూ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేసుకుంటున్నారు.

ఎన్టీఆర్ ఏఎన్నార్ హయాంలో టాలీవుడ్ లో ఎన్నో మల్టీస్టారర్ చిత్రాలు వచ్చేవి. చరిత్రలో నిలిచిపోయిన చిత్రాలు కూడా ఉన్నాయి. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు ఇలా స్టార్స్ అంతా కలసి నటించేవారు కానీ ఫ్యాన్స్ మధ్య ఎలాంటి విభేదాలు ఉండేవి కాదు. 

అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇద్దరు స్టార్ హీరోలు కలసి మల్టీస్టారర్ చిత్రంలో నటించడం గగనం అయిపోతోంది. ఒక వేళ నటించినా మా హీరో గొప్ప అంటే మా హీరోనే గొప్ప అంటూ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేసుకుంటున్నారు. ఎన్టీఆర్, రాంచరణ్ లాంటి బడా హీరోలని పెట్టి భారీ మల్టీస్టారర్ చిత్రం చేయడం ఒక రాజమౌళికి మాత్రమే సాధ్యం అయింది. 

Latest Videos


సినిమా ఎలాగూ విజయం సాధించింది. కానీ ఫ్యాన్స్ మధ్య గొడవలు మాత్రం ఆగడం లేదు. మూవీ సక్సెస్ క్రెడిట్ విషయంలో రాంచరణ్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య గొడవలు ఆగడం లేదు. తరచుగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్ జరుగుతోంది. ఇది చాలదన్నట్లు అగ్నికి ఆజ్యం పోసినట్లు విజయేంద్ర ప్రసాద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ లో రాంచరణ్ పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నట్లు మాట్లాడారు. 

rrr

రాంచరణ్ పాత్రకి ఇంతలా నార్త్ లో రెస్పాన్స్ వచ్చింది అంటే అందుకు కారణం అతడి నటనే అంటూ విజయేంద్ర ప్రసాద్ కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్ పాత్ర సపోర్టింగ్ గా ఉంటుందని అర్థం వచ్చేలా కామెంట్స్ చేయడం తారక్ ఫ్యాన్స్ జీర్ణించుకోవడం లేదు. 

దీనితో మరోసారి సోషల్ మీడియాలో అటు తారక్ ఫ్యాన్స్, ఇటు చరణ్ ఫ్యాన్స్ ఒకరిని ఒకరు దూషించుకుంటూ హద్దులు మీరుతున్నారు. ఎన్టీఆర్ సాధించిన రికార్డులని, రాంచరణ్ సాధించిన రికార్డులని ఒకరిని ఒకరు పోల్చుకుంటూ నానా హంగామా చేస్తున్నారు. ఇదంతా విజేంద్ర ప్రసాద్ పెట్టిన మంటలే అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

ప్రస్తుతం రాంచరణ్ గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తుండగా.. ఎన్టీఆర్ దేవర మూవీలో నటిస్తున్నాడు. ఈ ఏడాదే ఈ రెండు చిత్రాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. సమ్మర్ కి రావాల్సిన దేవర వాయిదా పడ్డట్లు తెలుస్తోంది. 

click me!