టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ Vijay Deverakonda ప్రస్తుతం తన అప్ కమింగ్ ప్రాజెక్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇక నేషనల్ క్రష్ రష్మిక మందన్న Rashmika Mandanna కూడా తన రాబోయే చిత్రాలతో బిజీగా ఉన్నారు.
అయితే, వీరిద్దరూ గాఢ ప్రేమలో ఉన్నారని కొన్నేళ్లుగా రూమర్లు ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే వీరిద్దరూ టూర్లకు, వెకేషన్లకు, డిన్నర్లకు వెళ్తున్నారని కూడా ఫ్యాన్స్, నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఈ క్రమంలో ఆయా సమయాల్లో కొన్ని ఫొటోలు కూడా నెట్టింట వైరల్ అవుతూనే వస్తున్నాయి. ఇక తాజాగా మరిన్ని ఫొటోలు వైరల్ అయ్యాయి. వీరిద్దరూ సీక్రెట్ ట్రిప్ కు వెళ్లారని ఆ ఫొటోలను సోషల్ మీడియాలో మరింతా వైరల్ చేస్తున్నారు.
తొలుత విజయ్ దేవరకొండ తన రీసెంట్ ట్రిప్ కు సంబంధించిన కొన్ని ఫొటోలను పంచుకున్నారు. క్యాజువల్ లో స్ట్రీట్ వేర్ లో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత రష్మిక మందన్న కూడా తన ట్రిప్ కు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
రష్మిక మాత్రం వియాత్నంకు వెళ్లినట్టు చెప్పుకొచ్చింది. కానీ విజయ్ ప్లేస్ ను మెన్షన్ చేయలేదు. అయితే వీరిద్దరి ఫొటోలను గమనించిన నెటిజన్లు మాత్రం అన్నా.. వదినా కలిసే ట్రిప్ కు వెళ్లారని ఆ ఫొటోలను వైరల్ చేస్తున్నారు. జంట క్యూట్ గా ఉంటుందంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి వారి ట్రిప్ కు సంబంధించిన ఫొటోలు మాత్రం నెట్టింట వైరల్ గా మారాయి. ఇక మొన్నటి వరకు ఫిబ్రవరిలో విజయ్ - రష్మిక ఎంగేజ్ మెంట్ అంటూ గట్టిగా ప్రచారం జరిగింది. దీనిపై విజయ్ దేవరకొండ టీమ్ అవాస్తమని తెలిపినట్టు న్యూస్ వచ్చింది. కానీ రష్మిక, విజయ్ స్వయంగా మాత్రం ఖండించలేదు.
ఇక రష్మిక మందన్న - విజయ్ దేవరకొండ వారి అప్ కమింగ్ ఫిల్మ్స్ పై ఫోకస్ పెట్టారు. నెక్ట్స్ విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ తో ప్రేక్షకుల ముందుకు రాన్నారు. రష్మిక మందన్న ‘పుష్ప2’తో పాటు మరిన్ని చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.