విద్యాబాలన్ నే నైట్ కి రమ్మంటాడా?.. మంత్రికి మామూలుగా లేదుగా

First Published Nov 30, 2020, 4:13 PM IST

విద్యాబాలన్ గురించి తెలియనిదెవరకి...ఆమె కేవలం బాలీవుడ్ లోనే కాక భారతదేశం అంతటా ఆమెకు అబిమానులు ఉన్నారు. తెలుగులో కూడా ఆమె ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో చేసింది. ఆమె లో గ్లామర్ కన్నా నటనా పాళ్లు ఎక్కువ. అందుకే ఆమెకు ఆ స్దాయి క్రేజ్. అలాంటి ఆమె ఇమేజ్ ని టచ్ చేయాలని ఓ మినిస్టర్ ప్రయత్నం చేసి, వివాదం పాలయ్యారు. ఆమెను నైట్ డిన్నర్ కు పిలిస్తే రాలేదని, షూటింగ్ కు ఫర్మిషన్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడనే వార్త ఇప్పుడు దావానలంగా అలుముకుంది. ఈ విషయం మీడియాలో హైలెట్ కావటంతో ఆయన వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే..

కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా దాదాపు తొమ్మిది నెలలుగా సినిమా షూటింగ్ లు నిలిచిపోయాయి. ఈ మధ్యనే ప్రభుత్వం షరతులతో షూటింగ్‌లకు అనుమతులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో స్వీయ జాగ్రత్తలు, భద్రతా ప్రమాణాల్ని పాటిస్తూ కొందరు దర్శకనిర్మాతలు షూటింగ్‌లకు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విద్యాబాలన్‌ హీరోయిన్ గా నటిస్తున్న ‘షేర్ని’ సినిమా చిత్రీకరణ కూడా ప్రారంభం అయ్యింది.
undefined
ఈ సినిమాలో విద్యాబాలన్‌ అటవీ అధికారిణిగా కనిపించబోతున్నది. మనుషులకు, జంతువులకు మధ్యనున్న శత్రుత్వానికి పరిష్కారాన్ని అన్వేషించే పాత్రలో ఆమె కనిపించబోతున్నారు.
undefined
వరల్డ్‌ వైల్డ్‌లైఫ్‌ దినోత్సవం సందర్భంగా మార్చి 3న సినిమా చిత్రీకరణను ప్రారంభించారు. లాక్‌డౌన్‌ కారణంగా ఆ తర్వాత షూటింగ్‌కు బ్రేక్‌పడింది. ఈ మధ్యనే మళ్లీ చిత్రబృందం రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభించింది. మధ్యప్రదేశ్‌ అడవుల్లో విద్యాబాలన్‌పై కీలక సన్నివేశాల్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేసారు.
undefined
ఈ నేఫధ్యంలో సినిమా షూటింగ్ కోసం మధ్యప్రదేశ్ అటవీ శాఖ మంత్రిని విజయ్ షాను కలిశారు చిత్ర నిర్మాతలు. అందుకు ఆయన కూడా ఒప్పుకున్నారట. కానీ అందులో ఒక కండిషన్ పెట్టినట్లు రూమర్స్ వచ్చాయి.
undefined
అడవుల్లో సాగే సన్నివేశాల షూటింగ్ కోసం కొన్ని వారాల క్రితం విద్యాబాలన్‌ అక్కడికి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆమెను విజయ్‌ షా డిన్నర్‌కు ఆహ్వానించారని.. దాన్ని నటి తిరస్కరించారని వార్తలు వచ్చాయి.
undefined
ఆ మరుసటి రోజు అటవీశాఖ అధికారులు ప్రొడక్షన్‌ హౌస్‌ వాహనాల్ని అడవుల్లోకి అనుమతించలేదని, అవి అక్కడే ఆగిపోయాయని ప్రచారం జరిగింది. సినిమా షూటింగ్‌ను కూడా ఆపేశారని చెప్పుకొచ్చారు. దీనిపై ఇప్పుడు మంత్రి స్పందించారు.
undefined
‘వాళ్లు బాలాఘాట్‌లో సినిమా షూటింగ్‌ కోసం అనుమతి తీసుకున్నారు. నన్ను డిన్నర్‌కు రమ్మని ఆహ్వానించారు. ఇప్పట్లో సాధ్యం కాదని చెప్పాను. మహారాష్ట్రకు వచ్చినప్పుడు కలుస్తానని చిత్ర టీమ్ కి తెలిపా. దీంతో భోజన ఏర్పాట్లు ఆగిపోయాయి, సినిమా షూటింగ్‌ కాదు. నన్ను వాళ్లు ఆహ్వానించారే కానీ నేను కాదు..’ అని విజయ్‌ పేర్కొన్నారు.
undefined
అయితే ఆయన చెప్పే దాంట్లో నిజం లేదని, ఆయన విద్యాబాలన్ పై మనస్సు పడి తను మంత్రి కదా అనే అహకారంతో ఖచ్చితంగా ఆమె నైట్ డిన్నర్ కు వస్తుందనే ఆలోచనతో ఇలా చేసి, ఇప్పుడు రచ్చ రచ్చ అయ్యేసరికి మాట మారుస్తున్నాడంటున్నారు.
undefined
ఇక విద్యాబాలన్ ఈ విషయమై స్పందించలేదు. ఆమె మాత్రం తన పాత్రపై పూర్తి నమ్మకంగా ఉంది. సినిమా మంచి విజయంసాధింస్తుందనే నమ్మకం ఉందని తెలియచేసింది.
undefined
ఆ మధ్యన హ్యూమన్‌ కంప్యూటర్‌, గణితంలో ఘనాపాటి అయిన శకుంతల దేవి బయోపిక్‌లో టైటిల్‌ పాత్రలో నటించింది. ఆ సమయంలోన హీరోలకంటే హీరోయిన్లకు పారితోషికం తక్కువగా ఇస్తుంటారన్న విషయంపై ఆమె అభిప్రాయం అడగగా.. ఆసక్తికరమైన సమాధానం చెప్పింది.
undefined
‘నా అనుభవాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఎందుకంటే గత 12 ఏళ్లుగా నేను ఎక్కువగా మహిళా ప్రాధాన్యం ఉన్న సినిమాలే చేస్తున్నా. ఆయా సినిమాల్లో నాదే ప్రధాన పాత్ర.. కాబట్టి అందరికంటే నాకే ఎక్కువ పారితోషికం అందుతుంది. కొన్నిసార్లు సీనియర్‌ నటిని కాబట్టి కూడా ఎక్కువగానే ఇస్తారు.
undefined
ఇక హీరోనే ప్రధానంగా నడిచే సినిమాల్లో పారితోషికంలో వివక్ష గురించి మిగతా హీరోయిన్లు ఏం అనుకుంటున్నారో నాకు తెలియదు. కానీ, చాలా కాలంగా పారితోషికంలో లింగభేదం గురించి ఆందోళన జరుగుతోంది. నా తరహా సినిమాలు చూసుకున్నా.. హీరోయిన్లకు.. హీరోలకు ఇచ్చే పారితోషికంలో తేడా ఉంటుంది. అయినా, ఇవన్నీ దాటుకుంటూ చాలా దూరం వచ్చామనే విషయాన్నే గుర్తుచేసుకుంటూ ఉంటా’’అని విద్యాబాలన్‌ చెప్పుకొచ్చారు.
undefined
click me!