వామ్మో భోజనం.. ఫుడ్‌ బఫెట్‌ని చూసి షాక్‌ తిన్న ప్రియాంక.. ఫోటో వైరల్‌

First Published Nov 30, 2020, 4:06 PM IST

గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా.. హాలీవుడ్‌ సినిమాలతో బిజీగా ఉంది. బాలీవుడ్‌ సినిమాలను చేసేలా కనిపించడం లేదు. ప్రస్తుతం లండన్‌లో ఉన్న ఈ బ్యూటీ ఫుడ్‌ని ఎంజాయ్‌ చేస్తుంది. అక్కడ తాజాగా ఫుడ్‌ బఫెట్‌ని చూసి భయపడుతున్నట్టుగా ఉన్న ఫోటోని పంచుకుని వామ్మో అన్నట్టుగా ఎక్స్ ప్రెషన్‌ పెట్టింది. 

ప్రియాంక చోప్రా లండన్‌లో ఉంది. ఈ సందర్భంగా ఓ హోటల్‌కి వెళ్ళగా, వాళ్ళు అన్ని రకాల ఐటెమ్స్ తో కూడిన జంబోని ముందు పెట్టారు. అందులో గుడ్డ నుంచి మాంసంవరకు, సలాడ్‌, ఒక్కటి అని కాదు చాలా ఉన్నాయి. వాటిని చూసి ప్రియాంక భయపడుతున్నట్టుగా ఓ లుక్‌ ఇచ్చింది.
undefined
రెండు చేతులతో ముఖాన్ని కళ్ళని కప్పేసి ఓ కన్నుతో ఆ భోజనాన్ని చూస్తుంది. అంతేకాదు ఈ సందర్భంగా `నేను దీనితో ఏం చేయాలి?` అని పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ ఫోటోసోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.
undefined

Latest Videos


దీనిపై సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. హీరో రాజ్‌కుమార్‌ రావు స్పందిస్తూ, `హాహాహా.. మీరు దీన్ని పూర్తి చేయగలరు. కమాన్‌ ప్రియాంక` అని కామెంట్‌ చేయగా, ఓఅభిమాని స్పందిస్తూ, కొంచెం మాకు కూడా పంపించండ`ని అని పేర్కొన్నారు. మొత్తానికి ఈ ఫోటో తెగ వైరల్‌ అవుతుంది.
undefined
ప్రియాంక ప్రస్తుతం నిక్‌ జోనాస్‌తో కలిసి అఎమరికాలో ఉంటుంది. ఇటీవల వీరిద్దరు కలిసి షాపింగ్‌ చేసిన ఫోటోలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
undefined
ఇదిలా ఉంటే ఇండియన్‌ సినిమాకి ప్రియాంక చేస్తున్న సేవలను, ప్రపంచ వ్యాప్తంగా మన భారతీయ కళ గొప్పతనాన్ని చాటుతున్న నేపథ్యంలో ప్రియాంకకి కేంద్ర ప్రభుత్వంపద్మశ్రీ పురస్కారంతో గౌరవించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రియాంక మరోసారి గుర్తు చేసుకుంది.
undefined
నాలుగేండ్ల క్రితం రాష్ట్రపతి భవన్‌లో దిగిన ఫోటోలను మళ్లీ పంచుకుంటూ తమ అమ్మా నాన్నలను, ఫ్యామిలీ మెంబర్స్ ని గుర్తు చేసుకుంది.
undefined
అయితే వీరిలో తన నాన్న లేకపోవడం పట్ల తాను విచారం వ్యక్తం చేసింది. ఆయన లేకపోయినా, మా మనసుల్లోనే ఉన్నారని పేర్కొంది.
undefined
అంతేకాదు పద్మశ్రీ అవార్డు కి ఉన్న గౌరవం, గొప్పతనమేంటో తమ ఫ్యామిలీకి తెలుసని, అందుకే వారు అవార్డు స్వీకరణ సమయంలో యూనిఫామ్‌లో రెడీ అయి వచ్చారనిపేర్కొంది ప్రియాంక. ప్రస్తుతం ఈ ఫోటోలు పంచుకుని మరోసారి తన అనందాన్ని, అనుభూతిని పొందింది ప్రియాంక.
undefined
ప్రస్తుతం ప్రియాంక `ది వైట్‌ టైగర్‌`, `వి కెన్‌ బి హీరోస్‌`, `ది మ్యాట్రిక్స్ 4`, `టెక్స్ ఫర్‌ యు` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. చివరగా బాలీవుడ్‌లో ఈ అమ్మడు `ది స్కై ఈజ్‌పింక్‌` చిత్రంలో మెరిసిన విషయం తెలిసిందే.
undefined
click me!