ఫిల్మ్ ఇండస్ట్రీలో వారసులకు కొదవలేదు. ఇప్పటికే టాలీవుడ్ లో ఉన్న సీనియర్ హీరోల వారసులు అందరు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. కొంత మంది స్టార్ హీరోలుగా వెలుగు వెలుగుతుంటే.. మరికొంత మంది మాత్రం సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. మరీ ముఖ్యంగా టాలీవుడ్ కు నాలుగు స్థంబాల్లాగా స్టార్ డమ్ ను చూసిన హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున,వెంకటేష్. ఈనలుగురు ఇండస్ట్రీని నిలబెట్టారు.