అనంతరం మరో హీరో వద్దకు వెళ్లింది. రవిరాజా పినిశెట్టి దర్శకుడిగా కన్ఫమ్ అయ్యారు. రాజేంద్రప్రసాద్తో ఈ మూవీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆల్మోస్ట్ సినిమా ప్రకటన కూడా జరిగింది. కానీ చివరి నిమిషంలో హీరో మారిపోయాడు. అప్పటికే తమిళంలో విడుదలై పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది.
దీంతో రాజేంద్రప్రసాద్ ఇమేజ్ సరిపోదని భావించిన టీమ్ వెంకటేష్ వద్దకు వెళ్లారు. ఆయన, సురేష్ బాబు వినగానే ఓకే చెప్పడంతో వెంటనే పట్టాలెక్కింది. చాలా ఫాస్ట్ గా మూవీని ఫినీష్ చేసి 1992 సంక్రాంతికి విడుదల చేశారు.
దీనికి ఫ్యామిలీ ఆడియెన్స్ క్యూ కట్టారు. ఆ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలవడమే కాదు, అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇది సుమారు 16కోట్లు వసూలు చేసిందని టాక్, అప్పట్లో అదో సంచలనమని చెప్పొచ్చు.