టాలీవుడ్ సీనియర్ నటుడు వెంకటేశ్ (Venkatesh) ప్రస్తుతం ‘సైంధవ్’ Saindhav మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఫుల్ యాక్షన్ మోడ్ లో ఉన్నారు వెంకీ మామ. ఈ మూవీ కోసం అభిమానులూ ఎదురుచూస్తున్నారు.
పైగా ఈ చిత్రం వెంకీ కెరీర్ లో 75వ చిత్రం కావడం విశేషం. దాంతో సినిమాపైనా భారీ అంచనాలు ఉన్నాయి. అందులోనూ వెంకటేశ్ మాస్ అండ్ యాక్షన్ తో రాబోతుండటంతో ఫ్యాన్స్ కు పండగనే చెప్పాలి.
ఈ యాక్షన్ ఫిల్మ్ ను ‘హిట్ వెర్స్’ ఫేమ్ డైరెక్టర్ శైలెష్ కొలను Sailesh Kolanu తెరకెక్కిస్తున్నారు. వెంకీని తన అభిమానులు కోరుకున్న స్టైల్ తో చూపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు మాసీవ్ రెస్పాన్స్ వచ్చింది.
ఇక ఈరోజు సైంధవ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లోని RK బీచ్ లో గ్రాండ్ గా జరుగుతోంది. గోకుల్ పార్క్ లో గ్రాండ్ గా ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కు వెంకటేష్, నవాజుద్దీన్ సిద్దిఖ్, డైరెక్టర్ సైలేష్ కొలను, హీరోయిన్లు శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ హాజరయ్యారు.
ఈ సందర్భంగా వెంకీ అభిమానులు సహా సైంధవ్ చిత్రయూనిట్ అంతా హాజరైంది. దీంతో వెంకీ మామ అభిమానులు, వైజాగ్ ప్రజలు భారీగా ఈ ఈవెంట్ కి హాజరు అయ్యారు. ప్రాంగణమంతా సందడి సందడిగా మారింది.
ఈక్రమంలో వెంకీమామ ఎనర్జిటిక్ లుక్ తో అట్రాక్టివ్ గా అలరించారు. అలాగే బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిక్ కూడా స్టైలిష్ లుక్ లో మెరిశారు. హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ Shraddha Srinath, రుహానీ శర్మ కూడా బ్యూటీఫుల్ గా హాజరయ్యారు.
అలాగే ఈవెంట్ కు వెంకీ అభిమానులు భారీ స్థాయిలో హాజరయ్యారు. వెంకీపై ఉన్న అభిమానంతో ఫ్యాన్స్, స్థానికులు కూడా వచ్చి ఈవెంట్ ను సక్సెస్ చేశారు. ప్రస్తుతం ఈవెంట్ గ్రాండ్ గా కొనసాగుతోంది.