ఆ స్టార్‌ హీరోయిన్‌తో పెళ్లికి రెడీ అయిన వెంకటేష్‌ ? మధ్యలో అడ్డుపడింది ఎవరు?

First Published Oct 25, 2024, 8:19 PM IST

విక్టరీ వెంకటేష్‌, సౌందర్యతో కలిసి దాదాపు ఏడెనిమిది సినిమాలు చేశారు. హిట్‌ పెయిర్‌గా నిలిచారు. అలాంటిది ఈ ఇద్దరు మ్యారేజ్‌ చేసుకోవడానికి రెడీ అయ్యారనే వార్త ఆసక్తికరంగా మారింది. 
 

విక్టరీ వెంకటేష్‌.. పరాజయాలు లేని హీరోగా నిలిచారు. వరుసగా రీమేక్‌ సినిమాలతో రీమేక్‌ స్టార్‌గానూ నిలిచారు. రీమేక్‌ మూవీస్‌ మినిమమ్‌ గ్యారంటీగా ఉండటంతో వెంకీ ఎక్కువగా అలాంటి సినిమాలు చేశారు. దీనికితోడు తండ్రి రామానాయుడు గైడెన్స్ లో సినిమాలు చేస్తూ వరుసగా విజయాలు అందుకున్నారు. అందుకే ఆయన్ని `విక్టరీ` వెంకటేష్‌ అంటారనే విషయం తెలిసిందే. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

ఇటీవల వెంకటేష్‌ సినిమాలు అనుకున్న స్థాయిలో ఆడటం లేదు. చాలా సినిమాలు పరాజయం చెందుతున్నాయి. సరైన స్క్రిప్ట్ లను ఎంచుకోవడంలో విఫలమవుతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు కొంత పంథా మార్చినట్టు తెలుస్తుంది. తనకు యాప్ట్ గా నిలిచే ఫ్యామిలీ,కామెడీ ఎంటర్‌టైనర్లపై ఫోకస్‌ పెట్టారని సమాచారం. అందులో భాగంగానే ఇప్పుడు అనిల్‌ రావిపూడితో సినిమా చేస్తున్నారు వెంకీ. 
 

Latest Videos


ఇదిలా ఉంటే ఒకప్పుడు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రాలతో విజయాలు అందుకున్నారు వెంకీ. ఫ్యామిలీ ఆడియెన్స్ కి దగ్గరయ్యారు. ఆయన నటించిన సినిమాల్లో చాలా వరకు సౌందర్యతో చేసిన సినిమాలున్నాయి. వీరిద్దరి పెయిర్‌కి అప్పట్లో మంచి క్రేజ్‌ ఉండేది. వెండితెరపై జంటగానూ చూడముచ్చటగానూ ఉండేవాళ్లు. ఇద్దరు కలిసి ఐదారు సినిమాలు చేశారు.  `రాజా`, `ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు`, `దేవిపుత్రుడు`, `జయం మనదేరా`, `పవిత్ర బంధం`, `పెళ్లి చేసుకుందాం`, `సూపర్‌ పోలీస్‌` వంటి సినిమాలు వచ్చాయి. చాలా వరకు మంచి విజయాలు సాధించాయి. 
 

దీంతో ఈ ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం కూడా ఏర్పడింది. అయితే ఈ ఇద్దరి మధ్య స్నేహం ప్రేమ వరకు వెళ్లిందట. సౌందర్య వెంకీని బాగా ప్రేమించిందట. అంతేకాదు ఇద్దరు పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారట. అయితే సౌందర్య సోదరుడి వివాహానికి కేవలం తెలుగునుంచి వెంకటేష్‌ మాత్రమే గెస్ట్ గా హాజరయ్యారు. దీంతో దీని కారణంగానూ వీరి మధ్య లవ్‌ ట్రాక్‌ ఉందనే రూమర్లు వచ్చాయి. అప్పటికే వెంకటేష్‌కి మ్యారేజ్‌ అయ్యింది. అయినా మరో పెళ్లికి రెడీ అయ్యారనే రూమర్స్ వస్తుంటాయి.

వెంకీ, సౌందర్య కలిసి తిరిగే విషయం వెంకీ ఫాదర్, నిర్మాత రామానాయుడికి తెలిసిందట. ఆయన ఇన్‌ వాల్వ్ అయి ఇద్దరిని మందలించాడట. ఆ తర్వాత నుంచి ఈ ఇద్దరు దూరమయ్యారనే రూమర్లు ఉన్నాయి. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికీ ఈ రూమర్స్ ఇంట్రెస్ట్‌ ని క్రియేట్‌ చేస్తున్నాయి. అయితే వెంకీ అలాంటి వారు కాదని, ఆయన ఫ్యామిలీ పర్సన్‌ అని ఆయన సన్నిహితులు చెప్పేమాట. నిజం ఏంటనేది వాళ్లకే తెలియాలి. 
 

అయితే సౌందర్యకి సంబంధించి మాత్రం పలు రూమర్లు వచ్చాయి. వెంకీతోపాటు జగపతిబాబు, జేడీ చక్రవర్తి వంటి వారు కూడా పెళ్లి చేసుకోవాలనుకున్నారనే పుకార్లు వినిపిస్తుంటాయి. జగపతి బాబు ఓపెన్‌గానే చెప్పారు. తన ఫాదర్ కోరుకున్నారనే విషయాన్ని ఆయన వెల్లడించారు. సౌందర్య 2004లో ఎన్నికల ప్రచారానికి వెళ్తూ హెలికాప్టర్‌ ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే. మరోవైపు వెంకీకి సినిమాల్లోకి ఎంట్రీ అవడానికి ముందే నీరజతో పెళ్లి అయ్యింది. వీరికి ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు అర్జున్‌ ఉన్నారు. ఇద్దరి కూతుళ్ల వివాహం చేశారు వెంకీ. కొడుకుని హీరోని చేసే అవకాశాలున్నాయి. 

Read more: లవర్‌ బాయ్ గా స్టార్‌ ఇమేజ్‌ పీక్‌, సడెన్‌గా సినిమాలకు అబ్బాస్‌ గుడ్‌ బై.. తప్పుకోవడానికి కారణం తెలిస్తే షాక్‌
Also Read: `నరుడి బ్రతుకు నటన` మూవీ రివ్యూ, రేటింగ్‌

click me!