2011లో విడుదలైన వెంకట్ ప్రభు దర్శకత్వంలో అజిత్ నటించిన మంకథ తమిళ చిత్రసీమలో ఒక మాస్ అనుభూతిగా నిలిచింది. త్రిష హీరోయిన్గా, అర్జున్, రాయ్ లక్ష్మి, ఆండ్రియా, అశ్విన్, వైభవ్, ప్రేమ్జీ, మహత్, జయప్రకాష్ లాంటి తారాగణంతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. యువన్ శంకర్ రాజా సంగీతం, యాక్షన్ పాత్రలు, ట్విస్టులు, సాహసోపేత సంఘటనలతో బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది.