Guppedantha Manasu: ప్రేమ వల్ల నలిగిపోతున్న వసు, రిషీ.. దగ్గర చేసేందుకు జగతి, మహేంద్ర ప్లాన్!

First Published Jun 28, 2022, 9:03 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ కుటుంబ కథా నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జూన్ 28 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
 

 ఈరోజు ఎపిసోడ్ లో వసు(vasu),రిషీ ఇద్దరు పుచ్చకాయ తింటూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత మహేంద్ర,జగతి ఎదురెదురుగా కూర్చోగా అప్పుడు జగతి తనలో తాను నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడు మహేంద్ర(mahendra)ఏంటి జగతి ఆ నవ్వుకు కారణం ఏంటో నాకు కూడా చెప్తే మేము నవ్వుతాం కదా అని అంటాడు.
 

అప్పుడు జగతి(jagathi), రిషీ, వసు దగ్గర అవుతున్నారు అని అనగా అప్పుడు మహేంద్ర అప్పుడే సంతోషపడిపోకు జగతి మన రిషీ(rishi) ఏ విషయాన్ని అంత ఈజీగా మర్చిపోడు అని అంటాడు. ఉదాహరణగా నీ విషయమే తీసుకుంటే ఇన్నేళ్లుగా అర్థం చేసుకుంటూనే ఉన్నాడు అని అనడంతో జగతి ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడు జగతి ఎమోషనల్ అవుతూ అక్కడనుంచి వెళ్ళిపోతుంది.
 

అప్పుడు మహేంద్ర(mahendra)జగతికి సర్ది చెప్పే ప్రయత్నం చేయగా జగతి బాధపడుతూ అక్కడి నుంచి వెళ్లి పోతుంది. మరొకవైపు వసు లవ్ లెటర్ చూసి మురిసిపోతూ ఉంటుంది. అప్పుడు వసు, రిషీ గురించి తనలో తానే మాట్లాడుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. అప్పుడు వసు(vasu), రిషీకి కాల్ చేయగా కట్ చేసి వసు అక్కడికి వచ్చినట్లు ఊహించుకుంటాడు. ఆ తరువాత రిషీ, జరిగిన విషయం గురించి తలచుకుని బాధ పడతాడు.
 

 రేపటి ఎపిసోడ్ లో రిషీ(rishi)కాలేజీ కి రాగా ఇంతలో ఫోన్ చేసి కాలర్ షిప్ టెస్ట్ లో వసు టాప్ లో ఉంది అని తెలియడంతో సంతోషంతో పొంగిపోతూ ఉంటాడు. అప్పుడు వసు అక్కడి నుంచి ఆనందంగా వెళ్ళి వసు కంగ్రాట్స్ చెబుతాడు. ఆ మాట విని వసు ఆనందంతో ఉంటుంది. అప్పుడు వసు ఆ రోజు మీరు అడుగడుగనా వెంటే ఉన్నారు అని అనడంతో రిషీ (rishi) జరిగిన విషయం తలచుకొని అక్కడనుంచి వెళ్ళి పోతాడు.
 

ఆ తర్వాత రిషీ,వసు అన్న మాటలను తలచుకుని ఆలోచిస్తూ ఉండగా మరొక వైపు వసు(vasu), స్కాలర్షిప్ టెస్ట్ లో పాస్ అయ్యాను కానీ రిషీ సార్ లైఫ్ లో ఫెయిల్ అయ్యాను అని బాధపడుతూ ఉంటుంది.  మరొకవైపు కాలేజ్ స్టాఫ్ అందరు వసు గెలుపు గురించి మాట్లాడుతూ ఉండగా ఆ మాట విని విని రిషి(rishi) ఆలోచనలో పడతాడు. మరొకవైపు వసుధార ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ బాధ పడుతూ ఉంటుంది.
 

ఆ తరువాత జగతి(jagathi), మహేంద్రతో మాట్లాడుతు వసు స్కాలర్షిప్ టెస్టులో పాస్ అయినందుకు మినిస్టర్ గారు అభినందించారు అని చెబుతుంది. అప్పుడు వసు గెలుపు ఈ సందర్భంగా మినిస్టర్ గారు మరొక సామాజిక కార్యక్రమం చేయమని చెప్పారు అని అంటుంది. మరొకవైపు రిషీ (rishi)అమ్మవారి దగ్గరికి వెళ్ళి తన మనసులో మాటలను అమ్మవారికి చెప్పుకొని బాధ పడుతూ ఉంటాడు. అప్పుడు రిషీ అమ్మవారి దగ్గర వసు పేరును రాసి తనని నువ్వే కాపాడాలి నువ్వే రక్షించాలి అని అంటాడు. ఆ తరువాత వసు అక్కడికి వచ్చి రిషీ పేరును రాస్తుంది.

click me!