అప్పుడు గౌతమ్ అంకుల్ మేడంకి ఏం కాదు అని ధైర్యం చెప్పి టీ తాగమని చెప్పగా ఇంతలోనే అక్కడికి వసుధార వస్తుంది. ఆ తర్వాత మహేంద్ర, వసుధార, గౌతమ్ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత రిషి బ్లడ్ ఇవ్వడం పూర్తి అవ్వడంతో జగతి వైపు ఎమోషనల్ గా చూస్తూ ఉంటాడు. అప్పుడు రిషి,జగతి దగ్గరికి వెళ్లి గతంలో జగతి మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటాడు. అప్పుడు జగతి రిషి రిషి అని కలవరిస్తూ ఉంటుంది. అప్పుడు రిషి జగతి వైపు ఎమోషనల్ గా చూస్తూ మేడం మీకేం కాదు మీకేం కానివ్వను అని అక్కడ నుంచి వెళ్తుండగా జగతి రిషి చేయి పట్టుకుంటుంది.