Guppedantha Manasu: దీనంతటికీ కారణం అనుపమ అంటున్న వసుధార.. ధరణి సహాయం కోరిన ఫణీంద్ర!

Published : Oct 31, 2023, 07:48 AM IST

Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకొని  మంచి టిఆర్పి తో రేటింగ్ దూసుకుపోతుంది. భార్య కొడుకు చేసిన పనులని భరించలేకపోతున్న ఒక భర్త కథ ఈ సీరియల్. ఇక ఈరోజు అక్టోబర్ 31 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

PREV
19
Guppedantha Manasu: దీనంతటికీ కారణం అనుపమ అంటున్న వసుధార.. ధరణి సహాయం కోరిన ఫణీంద్ర!

 ఎపిసోడ్ ప్రారంభంలో ఇక్కడ ప్రమాదాలు పొంచి ఉన్నాయి వెళ్లిపోండి అంటుంది అనుపమ. నేను అదే అనుకుంటున్నాను మీరేమంటారు అని రిషి వాళ్ళని  అడుగుతాడు మహేంద్ర. ఇక్కడ ఇంత ప్రమాదాలు జరుగుతున్నప్పుడు వుండడం ఎందుకు వెళ్ళిపోదాం అంటుంది వసుధార. ఆ తర్వాత అనుపమ ని పేరు అడుగుతుంది. అనుపమ తన పేరు చెప్పేసరికి రిషి దంపతులు షాక్ అవుతారు.
 

29

అది గమనించిన మహేంద్ర సరే మేము బయలుదేరుతాం అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. వెనకే రిషి వాళ్ళు కూడా బయలుదేరుతారు. ఆ తర్వాత  ఇంటికి వచ్చిన రిషి  అసలు ఎందుకో మన చుట్టూనే ఇలా జరుగుతుంది అంటాడు. సమయానికి అనుపమ గారు వచ్చి కాపాడారు కాబట్టి సరిపోయింది అంటాడు. అసలు ఆవిడ ఎవరు సార్ అంటుంది వసుధార.
 

39

 ఆవిడ ఎవరో ఆత్మీయురాలి లాగా అనిపిస్తుంది, డాడీకి తనకి ఏదో గతం ఉన్నట్టు ఉంది అంటాడు రిషి. అనుకోవడం కాదు సార్ నిజంగానే ఉంది ఆరోజు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు అక్కడ జగతి మేడం మావయ్య పేరుతో పాటు ఆవిడ పేరు కూడా ఉంది. తర్వాత ఆవిడ మావయ్యని ఒకసారి రిసార్ట్లో డ్రాప్ చేసినప్పుడు నేను చూశాను అంటుంది. అవునా ఇదంతా నాకెందుకు చెప్పలేదు అంటాడు రిషి.
 

49

 అప్పుడు నేను సీరియస్ గా తీసుకోలేదు అంటుంది వసుధార. ఇంతలో మహేంద్ర వచ్చి మనం అరుకు వెళ్లకుండా ఉండి ఉండాల్సింది.అక్కడికి వెళ్లి మీరు అనవసరంగా డిస్టర్బ్ అయ్యారు అంటాడు మహేంద్ర. అలాంటిదేమీ లేదు అంటూ అనుపమ గురించి అడగాలనుకుంటాడు రిషి. వద్దని వారిస్తుంది వసుధార. మాట మార్చేసిన రిషి మీరు మారిపోయారు కదా ఇకమీదట తాగారు కదా అంటాడు.
 

59

 ప్రయత్నిస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మహేంద్ర. మావయ్య మన మాటలు విన్నట్లుగా ఉన్నారు అయినా ఆయన చెప్పటానికి ఇష్టపడటం లేదు కానీ మావయ్య లో వచ్చిన మార్పు కి కారణం ఆ అనుపమ గారే అనుకుంటున్నాను అంటుంది వసుధార. మరోవైపు ఎండి సీట్ నీకు దక్కదు అమెరికా వెళ్ళిపోతావా అంటుంది దేవయాని. అలా అంటావేంటి మమ్మీ ఆ పదవి నాకు ప్రాణం. అది దక్కడానికి ఏదైనా ప్లాన్ చెప్పు అంటాడు శైలేంద్ర.
 

69

కొన్ని ప్రాణాలు పోయాయి ఇంకా పోవలసిన ప్రాణాలు కొన్ని ఉన్నాయి అంటుంది దేవయాని. అప్పుడే అక్కడికి వచ్చిన ఫణీంద్ర ప్రాణాల గురించి మాట్లాడుకుంటున్నారు మీ మాటలు వింటే భయంగా ఉంది ఏం మాట్లాడుకుంటున్నారు అని నిలదీస్తాడు. అప్పుడే వచ్చిన ధరణి చిన్నత్తయ్య చనిపోయారు కదా ఆవిడ గురించే మాట్లాడుకుంటున్నారు అంటుంది ధరణి. అవును అంటుంది దేవయాని.
 

79

బ్రతికున్నప్పుడు ఎప్పుడూ తను నీ దగ్గరికి చేరనివ్వలేదు దూరమైన తర్వాత ఇప్పుడు ఆలోచిస్తున్నావు అంటే నేను నమ్మను అంటూ కోడలితో నాకు ఒక సహాయం చెయ్యు అని అడుగుతాడు. ఏమిటి మామయ్య అంటుంది ధరణి. ఈ తల్లి కొడుకుల్ని మాట్లాడుకోనివ్వకు అంటూ వీళ్ళు వీళ్ళ ప్రవర్తన చూస్తే చిరాకు పుడుతుంది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఫణీంద్ర. నేను ట్రై చేస్తాను మామయ్య అంటుంది ధరణి.ధరణి వెళ్లిపోయిన తర్వాత ముందు దీనిని వేసేయాలి మమ్మీ అంటాడు శైలేంద్ర.
 

89

 మనం ఏమి చేయలేము కానీ ఇప్పుడు తన సంగతి వదిలేయ్. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని చెప్పి కొడుక్కి తన ప్లాన్ చెప్తుంది దేవయాని కానీ అనుపమ గురించి ఎంక్వయిరీ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్త అనుపమ గురించి మీకు ఎలా తెలుసు అని మహేంద్ర సీరియస్ యాక్షన్ తీసుకుంటాడు అని కొడుకుని హెచ్చరిస్తుంది. మరోవైపు బట్టలు మడత పెడుతున్న వసుధార దగ్గరికి వచ్చి నేను హెల్ప్ చేస్తాను అంటాడు రిషి.మీరు నా ఎండి సర్ మిమ్మల్ని నేను ఒక శిఖరంలాగా చూస్తాను మీరు ఇలాంటి పనులు చేయటం నాకు ఇష్టం ఉండదు అంటుంది వసుధార.
 

99

 నువ్వు నన్ను ఎంత గొప్పగా ఊహించుకున్నా ఒక భర్తగా మాత్రం నేను సాయం చేస్తాను అంటూ ఆమె దగ్గర చీర లాక్కోబోతాడు రిషి. ఆ చీర తీసుకొని బయటికి పరిగెడుతుంది  వసుధార. ఆమె వెనకే రిషి కూడా పరిగెడతాడు. వాళ్ళిద్దరూ అలా ఆనందంగా ఉండడం చూసి మహేంద్ర సంతోషిస్తాడు. మనం వీళ్ళిద్దరిని ఇలాగే చూడాలని తపనపడ్డాం కదా జగతి అని మనసులో అనుకుంటాడు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

click me!

Recommended Stories