హనీమూన్‌కి చెక్కేసిన మెగా కొత్త జంట వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి?.. ఫోటోతో క్లారిటీ ఇచ్చిన మెగా ప్రిన్స్..

First Published Dec 3, 2023, 7:40 PM IST

మెగా కొత్తగా జంట వరుణ్‌ తేజ్‌, లావణ్యత్రిపాఠి ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన నెల రోజులకు హనీమూన్‌కి వెళ్లారు. తాజాగా ఈ ఇద్దరు వెకేషన్‌లో కనిపించడం విశేషం. 
 

మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. `మిస్టర్‌` సినిమా సమయంలో ఈ ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఐదేళ్లు ప్రేమించుకున్న ఈ జంట ఎట్టకేలకు నవంబర్‌ 1న గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు. ఇటలీలో డెస్టినీ వెడ్డింగ్‌ చేసుకున్న విషయం తెలిసిందే. 
 

అనంతరం హైదరాబాద్‌లో రిసెప్షన్‌ జరిగింది. ఇక ఆ తర్వాత హైదరాబాద్‌లోనే తమ ఇంట్లో దీపావళి సెలబ్రేట్‌ చేసుకున్నారు. అ తర్వాత నిహారిక కొత్త సినిమా ఓపెనింగ్‌లో పాల్గొన్నారు. ఫ్యామిలీకే టైమ్‌ కేటాయించారు. ఇక ఇప్పుడు హనీమూన్‌ ప్లాన్‌ చేసినట్టు తెలుస్తుంది. తాజాగా ఈ జంట వెకేషన్‌కి వెళ్లారు. శనివారం హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్ లో మెరిసింది. 
 

Latest Videos


తాజాగా వెకేషన్‌కి సంబంధించిన ఫోటోని పంచుకున్నారు వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి. ట్రావెల్‌ ఆన్‌ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ లో పోస్ట్ పెట్టారు. ఇందులో ఎయిర్‌ పోర్ట్ లో దిగిన ఫోటోని పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్‌ అవుతుంది. అయితే వాళ్లు వెకేషన్‌కి వెళ్తున్నట్టుగా ఫోటో పెట్టినా.. చూడ్డానికి ఇది హనీమూన్‌ అని అర్థమవుతుంది. 
 

అయితే ఈ జంట ఎక్కడికి వెళ్తున్నారనేది మాత్రం క్లారిటీ లేదు. రేపటి వరకు దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ హనీమూవీన్‌ని ఎంజాయ్‌ చేయబోతున్నారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అభిమానులు స్పందిస్తూ ఎంజాయ్‌ అంటూ రకరకాలుగా పోస్టులు పెడుతున్నారు. కొంత జంట క్యూట్‌గా ఉందని, ఎంతో చూడముచ్చటగా ఉందని అభినందనలు తెలియజేస్తున్నారు. 

ఇక ప్రస్తుతం వరుణ్‌ తేజ్‌.. `ఆపరేషన్‌ వాలెంటైన్‌` చిత్రంలో నటిస్తున్నారు. శక్తి ప్రతాప్‌ సింగ్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మనుషి చిల్లర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. యుద్ధం, ప్రేమ మేళవింపుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ  నెల 8న విడుదల కావాల్సి ఉంది. కానీ వాయిదా వేసినట్టు తెలుస్తుంది. కానీ దీనిపై క్లారిటీ లేదు. అయతే గత కొంత కాలంగా వరుణ్‌కి విజయాలు లేవు. మరి ఈ మూవీ అయినా సక్సెస్‌ ఇస్తుందా చూడాలి. 
 

click me!