`ఆచార్య` సెట్‌కి ఉపాసన.. బ్లాక్‌ టీషర్ట్ లో చిరు, చెర్రీ అదరగొడుతున్నారుగా (ఫోటోలు)

First Published Mar 4, 2021, 2:43 PM IST

మామ చిరంజీవి, భర్త రామ్‌చరణ్‌లను చూసేందుకు రాజమండ్రి వెళ్లింది ఉపాసన. ప్రస్తుతం చిరంజీవి, రామ్‌చరణ్‌ `ఆచార్య` షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఇది రాజమండ్రి సమీపంలోని మారెడుమిల్లి అటవి ప్రాంతంలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో చిరంజీవితోపాటు రామ్‌చరణ్‌ కూడా పాల్గొంటున్నారు. 

గత నాలుగైదు రోజులు ఈ సినిమా షూటింగ్‌ మారెడుమిల్లిలో జరుపుకుంటోన్న నేపథ్యంలో సెట్‌లోకి వెళ్లేందుకు బయలు దేరింది ఉపాసన.
undefined
బుధవారం సాయంత్రమే ఆమె రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ లో ల్యాండ్‌ అయ్యింది. ప్రస్తుతం ఆయా ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.
undefined
రెడ్‌ టాప్‌, బ్లాక్‌ లెగ్గిన్‌ ధరించింది ఉపాసన. మాస్క్ తోపాటు కూలింగ్‌ బ్లాక్‌ గ్లాసెస్‌ ధరించింది. కరోనా నియమాలను కచ్చితంగా ఫాలో అవుతుంది.
undefined
ఎయిర్‌పోర్ట్ లో ఉపాసన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇలా షూటింగ్‌ స్పాట్‌కి ఉపాసన వెళ్లడం చాలా అరుదు.
undefined
మరోవైపు షూటింగ్‌లో చిరంజీవి, రామ్‌చరణ్‌ బిజీగా ఉన్నారు. వీరిద్దరిపై కీలక సన్నివేశాలను, అలాగే ఓ సాంగ్‌ని కూడా ఇక్కడ షూట్‌ చేస్తున్నట్టు తెలుస్తుంది.
undefined
అక్కడ వెళ్లినప్పుడు అభిమానులు భారీగా స్థాయిలో రాగా వారికి చిరంజీవి, చరణ్‌ అభివాదం చెబుతున్న ఫోటోలు హడావుడి చేశాయి.
undefined
ఇక కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న `ఆచార్య` చిత్రంలో చిరంజీవి హీరోగా నటిస్తుండగా, రామ్‌చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. కాజల్‌ హీరోయిన్‌.
undefined
ఇందులో ఆచార్యగా చిరంజీవి, సిద్ధ అనే కామ్రేడ్‌(నక్సల్‌)గా రామ్‌ చరణ్‌ కనిపించనున్నారు. ఈ సినిమా మే 13న విడుదల కానుంది.
undefined
click me!