పుట్టింటికి వెళ్లిన ఉపాసన.. తల్లి కాబోతుండడంపై ఎమోషనల్ పోస్ట్, ఫోటోస్ వైరల్

First Published Dec 15, 2022, 10:22 PM IST

మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఉపాసన దంపతులు వివాహ బంధంతో ఒక్కటై పదేళ్లు పూర్తయింది. వీరిద్దరూ ఎంత అన్యోన్యంగా జీవిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఉపాసన దంపతులు వివాహ బంధంతో ఒక్కటై పదేళ్లు పూర్తయింది. వీరిద్దరూ ఎంత అన్యోన్యంగా జీవిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.  రాంచరణ్ సినిమాలతో బిజీగా ఉంటే.. ఉపాసన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తోంది.

రాంచరణ్, ఉపాసన పిల్లల్ని కనడం గురించి తరచుగా సోషల్ మీడియాలో చర్చ జరగడం చూస్తూనే ఉన్నాం. ఇక అభిమానులైతే మెగా వారసుడి కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వారి నిరీక్షణకు తెరదించేలా కొణిదెల అండ్ కామినేని ఫ్యామిలీ సూపర్ గుడ్ న్యూస్ ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి స్వయంగా సోషల్ మీడియాలో.. ఆంజనేయ స్వామి ఆశీర్వాదంతో త్వరలో రాంచరణ్, ఉపాసన తల్లి దండ్రులు కాబోతున్నారు అని ప్రకటించారు. 

దీనితో మెగా అభిమానులంతా సంబరాల్లో మునిగిపోయారు. అభిమానులు, సెలెబ్రిటీలు రాంచరణ్, ఉపాసనలకు శుభాకాంక్షలు చెబుతున్నారు. కొణిదెల, కామినేని ఫ్యామిలీస్ లో సంతోషం రెట్టింపు అయింది. ఉపాసన గర్భవతి కావడంతో అప్పుడే ఆమె జాగ్రత్తలు మొదలు పెట్టేసింది. 

తాజాగా ఉపాసన అత్తగారి ఇంటి నుంచి పుట్టింటికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఉపాసన తాజాగా చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. నా జీవితంలో ముఖ్యమైన మహిళల ఆశీర్వాదంతో మాతృత్వంలోకి ఎంటర్ కావడం సంతోషంగా ఉంది అంటూ తన తల్లి, అమ్మమ్మ, ఇతర ఫ్యామిలీ మెంబర్స్ తో ఉన్న ఫొటోస్ షేర్ చేసింది. 

ఈ ఫొటోస్ కి మిస్సింగ్ అత్తమ్మ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీనితో ఉపాసన పుట్టింటికి వెళ్ళింది అంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు. మహిళలు గర్భవతి అయ్యాక పుట్టింటికి వెళ్లడం ఆనవాయితీ. అందుకే ఉపాసన పుట్టింటికి వెళ్లినట్లు తెలుస్తోంది. 

రాంచరణ్, ఉపాసన 2012లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఉపాసన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. తన గురించి, ఫ్యామిలీ గురించి వరుసగా పోస్ట్ లు పెడుతూనే ఉంటుంది. 

click me!