బిగ్‌ బాస్‌ హౌజ్‌లో సరికొత్త ప్రేమకథలు, ఇది కదా అసలైన కంటెంట్‌, యష్మి కథ పెద్దదే!

First Published Sep 17, 2024, 11:43 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 8 లో ఇప్పటి వరకు ప్రేమ కథలకు సంబంధించిన కంటెంట్‌ దొరకడం లేదు. దీంతో ఆడియెన్స్ లోనూ ఆ అసంతృప్తి ఉంది. తాజాగా కొత్త జంటలు తెరపైకి వచ్చాయి. 
 

బిగ్‌ బాస్‌ తెలుగు 8వ సీజన్‌ 16వ రోజుకి చేరుకుంది. ఇప్పటికే రెండు వారాలు పూర్తయ్యాయి. హౌజ్‌ నుంచి మొదటి వారం బేబక్క, రెండో వారం శేఖర్‌ బాషా ఎలిమినేట్‌ అయ్యారు. ప్రస్తుతం హౌజ్‌లో 12 మంది ఉన్నారు. ఇక మూడో వారం నామినేషన్‌ ప్రక్రియ చాలా వాడి వేడిగా జరిగింది. ఇంకా చెప్పాలంటే గత రెండు వారాల కంటే హీట్‌ మరింత పెరిగిందని చెప్పొచ్చు.

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

కంటెస్టెంట్లు రెచ్చిపోయి కామెంట్లు చేసుకున్నారు. ముఖ్యంగా యష్మి రెచ్చిపోతుంది. వాదన వచ్చినప్పుడు చాలా ఫైర్‌ అయిపోతుంది. అవసరానికి మించి ఆమెలో ఫైరింగ్‌ కనిపిస్తుంది. మణికంఠ విషయంలో ఆమె సంచలన కామెంట్‌ కూడా చేసింది. తాను  ఉన్నంత వరకు మణికంఠని నామినేట్‌ చేస్తానని తెలిపింది. మరోసారి పృథ్వీరాజ్‌ ముందు కూడా అదే విషయం చెప్పింది. 

అయితే నామినేషన్‌లో జరిగిన దానికి యష్మిని కూల్ చేసే ప్రయత్నం చేశాడు నాగమణికంఠ. ఆమెని ఓదార్చే ప్రయత్నం చేశాడు. నామినేషన్‌లో జరిగింది వదిలేయమని తెలిపారు. ఆమె ఓకే వదిలేయమని చెప్పింది. అయితే ఆయన యష్మిని రెండు మూడు సార్లు హగ్‌ చేసుకున్నాడు. ఈ విషయంలో యష్మి ఇబ్బంది పడినట్టుగా ఫీలయ్యింది.

Latest Videos


అంతేకాదు బిగ్‌ బాస్‌ ముందు తన గోడు వెళ్లబోసుకుంది. తనని హగ్‌ చేసుకోవడం తన వల్ల కావడం లేదని, అతను అంతా ఫేక్‌గా ఉంటున్నాడని చెప్పింది. పైగా మణికంఠ అలా చేయడం ఇబ్బందిగా ఉందంటూ బిగ్‌ బాస్‌ ముందు కన్నీళ్లు పెట్టుకుంది. ఇదే విషయాన్ని పృథ్వీరాజ్‌ వద్ద వెల్లడించింది. హగ్‌ చేసుకోవడం తనకు కంఫర్ట్ గా లేదని చెప్పింది. అయితే తన కప్‌ కాఫీని మాత్రం పృథ్వీరాజ్‌తో పంచుకోవడం ఆశ్చర్యంగా మారింది. ఇద్దరు కలిసి ఒకే కప్‌లోని కాఫీ తగడం విశేషం. 

ఇక ఈ సారి బిగ్‌ బాస్‌కి అసలైన కంటెంట్‌ దొరికింది. హౌజ్‌లో లవ్‌ కి సంబంధించిన డిస్కషన్‌ జరిగింది. నిఖిల్‌, కిర్రాక్‌ సీతల మధ్య కాసేపు పులిహోర కలిపించాడు బిగ్‌ బాస్‌. ఆ తర్వాత విష్ణు ప్రియాని రంగంలోకి దించాడు. ఆమెతోనూ ఈ చర్చని నడిపించాడు. అనంతరం యష్మిని దీనిలోకి తీసుకొచ్చారు. సీత, విష్ణు ప్రియా పిలిపించి యష్మిని.. నిఖిల్‌ నిన్ను ఫ్లర్ట్ చేశాడా? అంటూ ప్రశ్నించారు.

అలా ఏం లేదని చెప్పింది. అయితే కన్ను కొట్టాడని అడగ్గా అతను కొట్టాడని, తాను కొట్టాను అంటూషాకిచ్చింది యష్మి. దీంతో సీత, విష్ణు ప్రియా, నైనిక నవ్వుకున్నారు. ఇది అర్థం కాక కాసేపు హడావుడి చేసిన యష్మి వెళ్లిపోయింది. నాగమణికంఠతో డిస్కషన్‌ రాగానే వెళ్లిపోవడం ఆయనంటే ఎంతగా ఇరిటేట్‌ అవుతుందో అర్థం చేసుకోవచ్చు. 

నిజానికి మణికంఠ విషయంలో యష్మి అలాంటి రియాక్షన్‌ అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఆమె ఓవర్‌గా రియాక్ట్ అవుతుందనేది బయటకు ప్రొజెక్ట్ అవుతుంది. అదే సమయంలో యష్మిలో ఇలాంటి కక్ష్యసాధింపు చర్యని ఎవరూ ఆమోదించే పరిస్థితి లేదు. ఈ విషయంలో విలన్‌ అయిపోయింది యష్మి.

మరోవైపు లవ్‌ ట్రాక్‌ల విషయంలో ఆమె పేరు కూడా వినిపిస్తుంది. సోనియా పృథ్వీరాజ్‌ని ప్రశ్నించింది. నీకు యష్మి అంటే ఇష్టమని డిస్కషన్‌ జరుగుతుందని, మిగిలిన వాళ్లు అనుకుంటున్నారని చెప్పగా, ఆమె ఇష్టం, నువ్వు కూడా ఇష్టమని చెప్పడంతో సోనియా ఖుషి అయ్యింది.

మరోవైపు నిఖిల్‌, యష్మిల మధ్య ట్రాక్‌ నడుస్తుందనే డ్రామా కూడా క్రియేట్‌ చేశారు. అలాగే యష్మి, పృథ్వీరాజ్‌ క్లోజ్‌గా మూవ్‌ కావడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇవన్నీ బిగ్‌ బాస్‌కి మంచి కంటెంట్‌గా మారింది. ఇన్నాళ్లు బిగ్‌ బాస్‌ లో ఇలాంటి ట్రాక్‌లు లేవనే వెలితి ఉండేది. ఇప్పుడు ఆ కంటెంట్‌ క్రియేట్‌ కావడం విశేషం. బిగ్‌ బాస్‌ కోరుకున్నది ఇప్పుడు వస్తుందని చెప్పొచ్చు. 
 

ఇక రేషన్‌ సాధించడం కోసం మూడు టాస్క్ లు ఇచ్చాడు బిగ్‌ బాస్‌. నిఖిల్‌కి చెందిన శక్తి టీమ్‌కి, అభయ్‌కి చెందిన కాంతార టీమ్‌లకు మధ్య పోటీలు పెట్టారు. మొదటిది పెట్టెల్లో పోటీలో పాల్గొనే కంటెస్టెంట్ ఫోటోలు ఉంటాయి. వాటిని ప్రత్యర్థి తొలగించి కిందపడేయాల్సి ఉంటుంది. ఇందులో అభయ్‌ టీమ్‌ నుంచి అఫ్రిదీ, నిఖిల్‌ టీమ్‌ నుంచి పృథ్వీరాజ్‌ పాల్గొన్నారు. పృథ్వీరాజ్‌ రాంగ్‌ గేమ్‌ ఆడి ఓడిపోయాడు.

అనంతరం క్యాబేజీలు బాడీతో నెడుతూ లైన్‌ దాటించే గేమ్‌ ఆడారు. ఇందులో నిఖిల్‌ టీమ్‌ విన్నర్‌గా నిలిచింది. ఈ విషయంలో సంచాలక్‌గా ఉన్న మణికంఠకి, అభయ్‌ టీమ్‌లో ఉన్న ప్రేరణకి మధ్య గట్టి వాగ్వాదం జరిగింది. చివర్లో తొక్కలో సంచాలక్‌ అంటూ ప్రేరణ కామెంట్‌ చేయడం ఆశ్చర్యపరిచింది.

కాసేపు ఇద్దరి మధ్య గట్టి వాగ్వాదం జరిగింది. ఈ విషయంలో మణికంఠ ఎమోషనల్‌ అయ్యారు. ఇందులో మణికంఠ కరెక్ట్ గానే ఉన్నాడు, కానీ ప్రేరణ ఆవేశం తట్టుకోలేక బరస్ట్ అయ్యింది. ఆమె విలన్‌ అయిపోయి, మణికంఠని హీరోని చేసింది.
 

చివరగా బెలూన్‌లను పగలగొట్టే టాస్క్ లో అభయ్‌, నిఖిల్‌ పాల్గొన్నారు. బాక్స్ దాటి బయట ఆడుతున్నాడని అభయ్‌ని వారించింది సంచాలక్‌ సోనియా. ఫైనల్‌గా అభయ్‌ బాడీకి ఒక బెలూన్‌ ఉంది. నిఖిల్‌కి లేదు. కానీ తనకు అడ్డంకులు ఎదురైనా గేమ్‌ ఆడాడని, పైగా బెలూన్‌లు ఎక్కువగా పగల గొట్టాడని చెప్పి నిఖిల్‌ శక్తి టీమ్‌ విన్నర్‌గా నిలిచిందని ప్రకటించింది సోనియా.

ఈ విషయంలో అభయ్‌ అభ్యంతరం తెలిపాడు. అంతేకాదు యష్మి కూడా గట్టిగా రియాక్ట్ అయ్యింది. సంచాలక్‌ నిర్ణయాన్ని తప్పుపడుతూ ఫైర్‌ అయ్యింది. ఆమె ఆడ పులిలా రెచ్చిపోయింది. నువ్వు పెద్ద ఛీటర్‌ అంటూ వారించింది. మణికంఠ విషయంలో విలన్‌గా మారిన యష్మి ఈ విషయంలో మాత్రం హీరో అయిపోయింది.

ఆడపులిలా రెచ్చిపోయింది. అదే సమయంలో ఇక్కడ కూడా శృతి మించిన రియాక్ట్ అయినట్టుగా అనిపిస్తుంది. మొత్తంగా 16వ రోజు బిగ్‌ బాస్‌ హౌజ్‌ ఇంట్రెస్టింగ్‌గా సాగింది. ఓ వైపు లవ్‌ ట్రాక్, మరోవైపు టాస్క్ లు, ఇందులో గొడవలు ఎంగేజ్‌ చేశాయని చెప్పొచ్చు. 
 

click me!