శేఖర్ బాషా ఎలిమినేషన్ తో హౌస్లో 12 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో విష్ణుప్రియ, నాగ మణికంఠ, పృథ్వీరాజ్, నైనిక, సీత, యష్మి, అభయ్, ప్రేరణ నామినేట్ అయ్యారు. వీరిలో ఒకరు ఇంటిని వీడాల్సి ఉంది. సోమవారం నుండి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి.
తాజా ట్రెండ్ ప్రకారం విష్ణుప్రియ టాప్ లో ఉందట. ఆమెకు 25 శాతానికి పైగా ఓట్లు నమోదు అయ్యాయట. అనూహ్యంగా రెండో స్థానంలో నాగ మణికంఠ ఉన్నాడట. బిగ్ బాస్ హౌస్ కి రాకముందు వరకు నాగ మణికంఠ ఎవరో తెలియదు. అయితే తన గేమ్ తో నాగ మణికంఠ ఆడియన్స్ లో ఫేమ్ రాబట్టాడు. సింపతీ గేమ్ అంటూ మొదట్లో విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ నాగ మణికంఠకు ఆడియన్స్ బాగానే ఓట్లు వేస్తున్నారని తెలుస్తుంది.