దీంతో.. ఫణీంద్ర, పంచమి బాగా బాధపడతారు. ఇదంతా ఎవరో చేసిన మోసం అని.. వీరిద్దరికీ అర్థమౌతుంది. అయితే.. ఆ మోసం చేసింది మేఘన అని ఫణీంద్ర అనుమానిస్తాడు. కానీ.. మోక్ష ప్రాణాలు కాపాడిందని పంచమి అనుమానించదు. ఫణీంద్ర మేఘనను నమ్మకుండా.. దూరంగా తీసుకువచ్చి.. తనను అడగాల్సిన విధంగా అడుగుతాడు. కానీ.. మేఘన కనపడుతున్న కరాళి మాత్రం.. ఏడుస్తూ.. తనకు ఏ పాపం తెలీదని నాటకం ఆడుతుంది. పంచమి నమ్మేస్తుంది.
వాళ్ల నుంచి దూరంగా వెళ్లి తర్వాత.. మేఘన.. ఎలాగైనా నీకు మోక్షను దూరం చేస్తాను అని పంతం పడుతుంది. మోక్షను బలి ఇచ్చి.. తన శక్తులు తాను సంపాదించుకోవాలి అనుకుంటుంది. పంచమి.. తన శక్తులు పోయినందుకు బాధపడకపోగా.. మోక్ష బతికినందుకు చాలా సంతోషిస్తుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది. మరి కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో చూద్దాం...