అధికారం ఇడ్లీ చేతికి..
మరోవైపు ఇడ్లీ బాబాయి... రామరాజు కుర్చీలో కూర్చొని బిల్డప్ కొడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి రామరాజు వస్తాడు. తండ్రి రావడం చూసి చందూ చాలా సంతోషిస్తాడు. ఎప్పటిలానే మీరు రైస్ మిల్లు చూసుకోండి నాన్న అని చందూ అనబోతుంటే.. వల్లీ.. ఉరుక్కుంటూ వచ్చేసి.. చెప్పనీకుండా ఆపుతుంది. చందూ వాళ్ల నాన్నకు బాధ్యతలు ఇస్తుంటే... వల్లీ ఇవ్వనివ్వదు. మామయ్య గారు.. కాసేపు సరదాగా గాలి పీల్చుకోవడానికి వచ్చారు అని వల్లి పుల్ల వేస్తుంది. ఆ మాట విని రామరాజు కూడా ఇబ్బంది పడతాడు. చందూ, వాళ్ల మామయ్య తిరుపతి.. రామరాజు ని రోజూ మిల్లు కు రావాలని.. రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ.. వల్లి మళ్లీ బాధ గాయం రేపుతుంది. ‘ అసలే మామయ్య అమూల్య పెళ్లి విషయం, సాగర్ ఉద్యోగం విషయంలో చాలా బాధగా ఉన్నారు. మిల్లుకు వచ్చేవారు అందరూ బియ్యం రేటు కాకుండా.. మీ చిన్న కూతురు ఇలా చేసింది అంటగా, మీ కొడుకు ఇలా చేశాడు అంటగా అని అంటారు. ఆ మాటలకు మామయ్య ఇంకా ఎక్కువ బాధ పడతారు’ అని వల్లి అంటుంది. వెంటనే రామరాజు.. కూడా అవును నేను రోజూ రైస్ మిల్లుకు రాను అని చెబుతాడు.
ఇక వెంటనే.. వల్లి తన ప్లాన్ అమలులో పెడుతుంది. తన తండ్రి క్యాష్ కౌంటర్ లో కూర్చొని బాధ్యతలు చూసుకుంటాడు అని రామరాజుని ఒప్పిస్తుంది. కాదు అనలేక... రామరాజు సరే అంటాడు. కానీ.. తన బావ కుర్చీలో వల్లి తండ్రి కూర్చోవడం తిరుపతికి నచ్చదు. వల్లి మాత్రం.. ఇక జన్మలో మామయ్య గారు మిల్లులో అడుగుపెట్టరు అని సంతోషపడుతుంది.
మరోవైపు.. ఆఫీసులో తన కొలిగ్స్ అన్న మాటలు తలుచుకొని నర్మద బాధపడుతూ ఉంటుంది. ఇంట్లో అత్తగారు కూడా తనతో మాట్లాడకపోవడం తలుచుకొని ఏడుస్తూ నడుచుకుంటూ వెళ్తుంది. నర్మద అలా ఏడుస్తూ రావడం ధీరజ్, ప్రేమ చూస్తారు. ఎందుకు ఏడుస్తున్నావ్? ఏమైంది అని ప్రేమ, ధీరజ్ అడిగితే నర్మద మరింత ఏడుస్తుంది. ఆఫీసులో తనకు జరిగిన అవమానం, అత్తయ్య మాట్లాడకపోవడం అన్నీ చెప్పి మరింత బాధపడుతుంది. ఆమెను ఓదార్చి ఇంటికి తీసుకువస్తారు.