Guppedantha Manasu 29th march Episode:అప్పుడు తల్లి, ఇప్పుడు కొడుకు, దేవయాణి మాస్టర్ మైండ్

First Published Mar 29, 2024, 8:25 AM IST

మనుకి ఇష్టమైన కూరలు ఏంటి అని ఏంజెల్ అడుగుతుంది. లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు ఏదో చెప్పాడు అని వసుధార, మను అంటే... అనుపమ మనుకి ఇష్టమైన వంటలన్నీ చెప్పేస్తుంది.
 

Guppedantha Manasu

Guppedantha Manasu 29th march Episode:వసుధార మనుకి కూడా భోజనం చేస్తుంంది. అందరూ కలిసి భోజనం చేద్దాం అని మహేంద్ర అంటాడు. కానీ.. అనుపమ తనకు ఆకలిగా లేదని చెబుతుంది.  నేను ఉంటే ఆమె భోజనం చేయదు అని మను చెబుతాడు. అయితే.. మహేంద్ర.. అదే విషయం అనుపమను అడుగుతాడు. కానీ అనుపమ సమాధానం చెప్పదు. మౌనం అంగీకారం అని వసుధార అంటంది. ఇక.. అందరూ ఫ్రెష్ అయ్యి భోజనానికి కూర్చుంటారు.

Guppedantha Manasu

కావాలనే.. అనేపమ పక్కనే మనుని కూర్చోపెట్టాలని.. ఏంజెల్ డ్రామా ప్లే చేస్తుంది. ప్లాన్ ప్రకారం.. అనుపమ పక్కన మనుని కూర్చోపెడతారు. ఇక అందరూ కలిసి భోజనం చేయడానికి రెడీ అవుతారు. కావాలనే  అనుపమకు.. మనుతో వడ్డించేలా వసుధార చేస్తుంది. తప్పక.. మను కూడా వడ్డిస్తాడు. అనుపమ మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది.  ఇక.. మనుకి ఇష్టమైన కూరలు ఏంటి అని ఏంజెల్ అడుగుతుంది. లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు ఏదో చెప్పాడు అని వసుధార, మను అంటే... అనుపమ మనుకి ఇష్టమైన వంటలన్నీ చెప్పేస్తుంది.
 

Guppedantha Manasu

నీకు ఎలా తెలుసు అత్తయ్య అని ఏంజెల్ అంటే... లాస్ట్ టైమ్ చెప్పాడు కదా అని అంటుంది. అయితే.. లాస్ట్ టైమ్ కూడా మనుకంటే ముందే నువ్వే చెప్పావ్ అని మహేంద్ర గుర్తు చేస్తాడు. మరి నీకు ఏం ఇష్టం అత్తయ్య అని ఏంజెల్ అడిగితే... అనుపమకు నచ్చినవన్నీ మను చెబుతాడు.  ఇద్దరికీ బాగా గుర్తున్నాయి అని, తల్లి ప్రేమను, తల్లి పెట్టిన గోరు ముద్దలను ఎవరూ మర్చిపోరు అని ఏంజెల్ అంటుంది. ఛాన్స్ దొరికిందని మహేంద్ర కూడా అనుపమ పై సెటైర్లు వేస్తాడు. చాలా మంది ఎవరూ లేక ఒంటరిగా భోజనం చేస్తారని.. కొందరు అందరూ ఉన్నా కూడా ఒంటరిగానే తింటారు అని అంటాడు. అనుపమ ఫేస్ మాడిపోతుంది. మహేంద్ర మాటలకు మను తలూపుతాడు. అలాంటివారి బాధ వర్ణనానీతం అని అంటాడు. అయితే.. ఏదో ఒకరోజు మంచి జరుగుతుందని మహేంద్ర ధైర్యం చెబుతాడు.

ఇక.. ఏంజెల్ సెల్ఫీ తీసుకుందామని అడుగుతుంది. అయితే.. అనుపమ వద్దు అంటుంది.  కానీ.. ఏంజెల్ వినదు దిగాల్సిందే అని, సోషల్ మీడియాలో షేర్ చేయనని.. భద్రం దాచుకోవడానికి అంటుంది. మేడమ్ కి ఇష్టం లేదేమో వద్దులే ఏంజెల్ అని మను అంటాడు. ఇక.. మహేంద్ర.. నువ్వు బాగా రెడీ అవ్వలేదని వద్దు అంటున్నావా అని అంటాడు. రెడీ అవ్వకపోయినా నవ్వు బాగుంటావ్ అత్తయ్య అని ఏంజెల్ చివరకు ఒప్పిస్తుంది.  ఇక ఫోటోలో కనిపించడం లేదని... అనుపమకు దగ్గరగా మనుని జరగమని అంటుంది. తర్వాత ఏంజెల్ ఫోటో తీస్తుంది. తర్వాత మళ్లీ అందరు భోజనం చేస్తారు.
 

Guppedantha Manasu

మధ్యలో అనుపమకు పొరమాలితే.. మను తట్టి.. మంచినీళ్లు తాగిస్తాడు. ఆ సీన్ చూసి మిగిలిన వాళ్లు మురిసిపోతారు. గతంలో మనుకి పొలిమారిన సందర్భాన్ని మహేంద్ర గుర్తు చేసుకుంటాడు. మొత్తానికి అందరూ భోజనం పూర్తి చేస్తారు.

మను వెళ్లిపోవడానికి రెడీ అవుతాడు. కానీ.. మహేంద్ర బలవంతంగా ఉండమని కూర్చోపెడతాడు. భోజనాలు ఎలా ఉన్నాయి అని మహేంద్ర అడిగితే.. తిన్నాను అంటాడు. ఆ సెల్ఫీ నీకు పంపుతాను అని ఏంజెల్ అంటుంది. ఇక.. మను వెళ్తాను అంటే..  మహేంద్ర ఊరుకోడు. ఏంజెల్ కూడా.. రేపు భోజనం తర్వాత వెళ్లమని చెప్పాం అని అంటుంది.
 

Guppedantha Manasu

ఇంటికి వెళ్లినా ఒంటరిగానే ఉంటావ్ కదా అని మహేంద్ర అంటే.. తన కోసం ఓల్డీ ఎదురు చూస్తుందని చెబుతాడు. ఫోన్ చేసి రావట్లేదు అని చెప్పమంటాడు. కానీ.. లేదని...తాను వెళ్లాల్సిందే అని మను అంటాడు. దీంతో.. మరీ బలవంత పెట్టడం ఇష్టంలేక మహేంద్ర సరే అంటాడు. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు అని కూడా చెబుతాడు. మను వెళ్తాను అంటే... వెళ్తాను కాదు.. వెళ్లి వస్తాను అనాలి అని ఏంజెల్ అంటుంది. తర్వాత.. అనుపమను ఏంజెల్ గదిలోకి తీసుకొని వెళ్తుంది.
 

Guppedantha Manasu

ఇక.. బయటకు వెళ్లిన మనుకి.. వసుధార ఓ విషయం మాట్లాడతాను అన్న సంగతి గుర్తుకువస్తుంది. దీంతో... మళ్లీ వెనక్కి వచ్చి.. మనుతో మాట్లాడతాడు. ఏదో మాట్లాడాలి అన్నారు కదా ఏంటని అడుగుతాడు.  దీంతో.. వసుధార.. మొన్న జరిగినదాంట్లో తప్పు లేదని తేలింది కాబట్టి.. మీరు మళ్లీ కాలేజీకి రమ్మని వసుధార అడుగుతుంది. కానీ.. వెళ్లిపోమ్మనడం మీ ఇష్టమే.. రమ్మనడం మీ ఇష్టమేనా అని అంటాడు. మీ మనసు హర్ట్ అయ్యిందని తెలుస్తోందని.. అందుకే మళ్లీ పిలుస్తున్నాను అని వసుధార అంటుంది.

కానీ.. తనను అనుపమ మేడమ్ కాలేజీకి రావద్దు అని చెప్పారని... ఆవిడ చెప్పింది ఏదైనా తాను శిరసా వహిస్తానని, అది ఏదైనా సరే అని అంటాడు. అయితే..మేడమ్  పిలిస్తే వస్తారా అని వసుధార అడుగుతుంది. మేడమ్ తో బలవంతంగా ఒప్పించడానికి ప్రయత్నించకండి.. అదే అయితే.. నేను సరిగా పని చేసకోలేను అని అంటాడు. వసుధార ఏదో చెప్పాలని ప్రయత్నించినా మను వినకుండా వెళ్లిపోతాడు.
 

Guppedantha Manasu

ఇక.. దేవయాణి.. అనుపమ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఏం ఆలోచిస్తున్నావ్ అని శైలేంద్ర అడుగుతాడు. మనుకి తన తండ్రి ఎవరో తెలీదని.. ఆ విషయంలో తల్లీ, కొడుకుల మధ్య గొడవకు కారణం అయ్యిందని.. దేవయాణి అంటుంది.  శైలేంద్ర షాకౌతాడు.  కానీ.. జరిగింది అదే అని.. దేవయాణి బలంగా చెబుతుంది. అలా తెలియకూడదు అనుకుంటోంది అంేట.... తండ్రి ఎవరో.. తెలియకూడని వ్యక్తి అయ్యి ఉండొచ్చు అని చెబుతుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక.. శైలేంద్ర.. తండ్రి పాయింట్ పట్టుకొని మనుని, అనుపమను టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఆ మాటలు పడలేక అనుపమ ఆవేశంలో నిజం బయటపెట్టే అవకాశం కూడా ఉంది. మరి... ఇది జరుగుతుందో లేదో తెలియాలంటే.. మరి కొద్దిరోజులువేచి ఉండాల్సిందే.
 

click me!