సీన్ కట్ చేస్తే... రాజీవ్ వెళ్లి.. మళ్లీ శైలేంద్రను కలుస్తాడు. మను గాడి మీద తెగ ఫ్రస్టేట్ అవుతూ ఉంటాడు. అసలు వాడు ఎవడు భయ్యా.. వాడి చేతిలో నా చావు ఉందని, జాతకం చూపించుకోమని చెబుతాడేంటి అని అంటాడు. ఎలాగైనా ఆ మను గాడి అడ్డు తప్పించుకోవాలని, చంపేస్తాను అని రాజీవ్ అంటాడు. అయితే.. గోటితో పోయేదానికి గొడ్డలిదాకా ఎందుకు వద్దని, కూల్ గా ఉండమని శైలేంద్ర అంటూ ఉంటాడు. అయితే రాజీవ్ మాత్రం వినిపించుకోడు. మాటలు పడింది నేనే కదా.. నా బాధ నీకు ఎలా ఉంటుంది అని రాజీవ్ అంటే,.. నిన్నంటే నన్ను అన్నట్లే అని.. వాడిని ఏదైనా చేస్తే.. ఇద్దరం ఇరుక్కుపోతామని, సమయం చూసి చేద్దాం అని.. తొందరపడొద్దని శైలేంద్ర చెబుతాడు.