BrahmaMudi 22nd March Episode: ఇక.. కావ్య జీవితం నాశనం అయ్యిందని...పెళ్లి రోజు పెటాకులు అయ్యిందని.. అనామిక, రుద్రాణి సంబరంగా ఉంటారు. ఇద్దరూ కలిసి కూల్ డ్రింక్ తాగుతూ తమ సంతోషాన్ని పంచుకుంటూ ఉంటారు. ఇక..రాజ్ పరువు పోయిందని రుద్రాణి సంబరంగా అంటుంది. అయితే.. ధాన్యలక్ష్మి తిడుతుంది. రాజ్ పరువు పోయిందంటే.. ఈ ఇంటి పరువు పోయినట్లే అని ఆ విషయం తెలియడం లేదా అని ధాన్యలక్ష్మి సీరియస్ అవుతుంది. అయినా తాను రాజ్ ని చిన్న పిల్లాడు అప్పటి నుంచి చూస్తున్నాను అని.. రాజ్ అలాంటి తప్పు చేసి ఉండడు అని అంటుంది. కళ్లెదురుగా సాక్ష్యం కనపుడుతున్నా కూడా అలా మాట్లాడుతున్నావేంటి ధాన్యలక్ష్మి అని రుద్రాణి అంటుంది.