ఓవైపు.. కనకం ఏడుస్తూ ఉంటుంది. తన కూతురికి అన్యాయం జరిగిందని ఇందిరాదేవి ని ప్రశ్నిస్తూ ఉంటారు. కనకం, మూర్తి ఇద్దరూ కలిసి.. తమ కూతురికి మీరే న్యాయం చేయాలని అడుగుతారు. మీరు ఇంటి పెద్ద అని.. మీరు మాత్రమే న్యాయం చేయగలరు అని వేడుకుంటారు. ఆ మాటలు అపర్ణ చెవిన పడతాయి. కనకం అంటూ సీరియస్ గా వస్తుంది. ఇది మా ఇంటి సమస్య అని.. మేమే.. వచ్చిన సమస్యను ఎలా తీర్చుకోవాలా అని చస్తుంటే. ఇప్పుడు మా బాధలో మేమున్నాం.. మా పెంపకాన్నే ప్రశ్నిస్తున్నారు.. మీకు న్యాయం చేయమని.. మా అత్తగారిని నిలదీస్తున్నారా, . అంటూ సీరియస్ అవుతుంది.