గత వారం గంగవ్వ ఇంటి నుండి వెళ్ళిపోయింది. ఎలిమినేట్ కాకుండానే గంగవ్వ షోకి గుడ్ బై చెప్పింది. వ్యక్తిగత కారణాలతో గంగవ్వ బయటకు వచ్చేశారు. ఇక నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఒక్కొక్కరిగా సేవ్ అవుతూ వచ్చారు. చివరికి యష్మి-హరితేజ మిగిలారు. వీరిద్దరిలో హరితేజ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు.
గంగవ్వ, హరితేజ నిష్క్రమణతో బిగ్ బాస్ హౌస్లో 10 మంది కంటెస్టెంట్స్ మిగిలారు. సోమవారం నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. యష్మి, గౌతమ్, విష్ణుప్రియ, టేస్టీ తేజ, పృథ్వి, అవినాష్ నామినేట్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించారు. వీరిలో ఒకరు వచ్చే వారం ఎలిమినేట్ కావాల్సి ఉంది. ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. లేటెస్ట్ ఓటింగ్ ట్రెండ్ లో అనూహ్య ఫలితాలు నమోదు అయ్యాయి.