వాడి వేడి వాదనల మధ్య నామినేషన్స్ ప్రక్రియ ముగియగా... ఐదుగురు సభ్యులు నామినేట్ అయ్యారు. నయని పావని, గౌతమ్, యష్మి, హరితేజ, టేస్టీ తేజ నామినేషన్స్ లిస్ట్ లో ఉన్నారు. కాగా ఓటింగ్ లో యష్మి ముందంజలో ఉందట. ఆమెకు అధికంగా ఓట్లు పోల్ అవుతున్నాయట. యష్మికి 35 శాతం ఓట్లు పడ్డాయట. మిగతా నలుగురు కంటెస్టెంట్స్ ఆమెకు పోటీ ఇచ్చే అవకాశం లేదట.
యష్మి వైల్డ్ కార్డు ఎంట్రీ కాదు. ఆమె ఫస్ట్ వీక్ నుండి హౌస్లో ఉంది. ఈ అంశం ఆమెకు కలిసొస్తుంది. ఇక రెండో స్థానంలో గౌతమ్ కృష్ణ ఉన్నాడట. అతడికి ఓట్లు పడటానికి మిగతా కంటెస్టెంట్స్ అంత స్ట్రాంగ్ కాకపోవడమే. నిజానికి గౌతమ్ 7వ వారం ఎలిమినేట్ కావాల్సింది. నాగ మణికంఠ సెల్ఫ్ ఎలిమినేట్ కావడంతో గౌతమ్ కి అవకాశం వచ్చింది. ఆ విధంగా సేవ్ అయ్యాడు.