సాధారణంగా ఆడియన్స్ ఓట్ల ఆధారంగా ఎలిమినేషన్ ఉంటుంది. శేఖర్ బాషా మాత్రం భిన్నంగా ఎలిమినేట్ అయ్యాడు. తోటి కంటెస్టెంట్స్ అతన్ని ఇంటి నుండి బయటకు పంపారు. శేఖర్ బాషా-ఆదిత్య ఓం లలో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉంది. అది ఎవరో డిసైడ్ చేయాలని హోస్ట్ నాగార్జున, కంటెస్టెంట్స్ ని కోరాడు. మెజారిటీ కంటెస్టెంట్స్ శేఖర్ బాషా ఎలిమినేట్ కావాలని కోరుకున్నారు.
బేబక్క, శేఖర్ బాషా ఎలిమినేషన్ అనంతరం హౌస్ 12 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. మూడవ వారానికి గాను విష్ణుప్రియ, సీత, ప్రేరణ, యష్మి, నైనిక, అభయ్, నాగ మణికంఠ, పృథ్విరాజ్ నామినేట్ అయ్యారు. వీరిలో ఒకరు ఇంటిని వీడాల్సి ఉంది.