రెమ్యునరేషన్ పై కూడా శేఖర్ బాషా పెదవి విప్పాడు. అయితే అసలు విజయం చెప్పకుండా జోక్ చేసి తప్పుకున్నాడు. మీకు రెండు వారాలకు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారని అడగ్గా.. మూడు కోట్లు ఇచ్చారు. కాకపోతే అవి బాగా టైట్ గా ఉన్నాయని, పంచ్ పేల్చాడు.
మరోవైపు మూడవ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ మొదలైంది. విష్ణుప్రియ, అభయ్, నైనిక, ప్రేరణ, పృథ్విరాజ్, నాగ మణికంఠ, సీత, యష్మి నామినేషన్స్ లో ఉన్నారు. విష్ణుప్రియ ఓటింగ్ లో ముందంజలో ఉందట. ఆమెకు అత్యధికంగా ఓట్లు పోల్ అవుతున్నాయట.