Bigg Boss Telugu 7
11వ వారం ఎలిమినేషన్ జరగలేదు. గౌతమ్, అశ్విని డేంజర్ జోన్లోకి వచ్చారు. ఇద్దరూ సేవ్ అయినట్లు నాగార్జున వెల్లడించారు. ఎవిక్షన్ పాస్ గెలుచుకున్న యావర్ దాన్ని వదులుకున్నాడు. గేమ్స్ సరిగా ఆడలేదని ఫ్రూవ్ అయిన నేపథ్యంలో యావర్ పాస్ వెనక్కి ఇచ్చేశాడు. ఈ క్రమంలో బిగ్ బాస్ ఎలిమినేషన్ రద్దు చేశాడు. అయితే 12వ వారం డబుల్ ఎలిమినేషన్ అని షాక్ ఇచ్చారు.
Bigg Boss Telugu 7
వాడివేడిగా నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. 12వ వారం ఇంటి నుండి బయటకు వెళ్లేందుకు శివాజీ, ప్రశాంత్, అమర్, యావర్, గౌతమ్, అశ్విని, రతిక, అర్జున్ నామినేట్ అయ్యారు. ప్రియాంక, శోభ నామినేషన్స్ లో లేరు. మంగళవారం రాత్రి నుండి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి.
Bigg Boss Telugu 7
ఈ వారం ఓటింగ్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయని సమాచారం. టాప్ లో కొనసాగే శివాజీ వెనకబడ్డాడట. పల్లవి ప్రశాంత్ మొదటి స్థానం సొంతం చేసుకున్నాడట. తర్వాత అమర్ ఉండగా మూడో స్థానంలో శివాజీ ఉన్నాడట. యావర్, గౌతమ్, రతిక తర్వాత స్థానాల్లో ఉన్నారట. అర్జున్, అశ్విని డేంజర్ జోన్లో ఉన్నారట.
Bigg Boss Telugu 7
అశ్విని ఎలిమినేట్ అయినట్లు తెలుస్తుంది. తాజా ప్రోమోలో నాగార్జున కూడా హింట్ ఇచ్చేశాడు. డబుల్ ఎలిమినేషన్ అని తెలిసి కూడా అశ్విని సెల్ఫ్ నామినేషన్ చేసుకుంది. ఎవరినీ నామినేట్ చేయని కారణంగా అశ్విని నేరుగా నామినేట్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించారు. ఇదే విషయాన్ని నాగార్జున ప్రస్తావించారు.
Bigg Boss Telugu 7
డబుల్ ఎలిమినేషన్ అని తెలిసి కూడా నువ్వు సెల్ఫ్ నామినేట్ అయ్యామంటే దీన్ని కాన్ఫిడెన్స్ అనాలా లేక ఓవర్ కాన్ఫిడెన్స్ అనాలా? అని నాగార్జున అడిగాడు. మన నిర్ణయాలు, చేసే తప్పులే మనకు దెబ్బేస్తాయని నాగార్జున అశ్వినితో అన్నాడు. కాబట్టి అశ్విని ఎలిమినేట్ అయినట్లు నాగార్జున పరోక్షంగా చెప్పాడని అంటున్నారు.