అక్కినేని నాగార్జున లేటెస్ట్ ఫిల్మ్ ‘నా సామి రంగ’ Naa Saami Ranga. ఈ చిత్రానికి విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు.
ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ‘నా సామి రంగ’ మూవీని ఆడియెన్స్ లోకి మరింతగా తీసుకెళ్లేందుకు అదే టైటిల్ Naa Saami Ranga తోనే ‘సంక్రాంతి స్పెషల్’ ఈవెంట్ ను షూట్ చేశారు. ఈ వేడుకకు నాగార్జునతో పాటు బిగ్ బాగ్ 7 కంటెస్టెంట్లు హాజరై సందడి చేశారు. యాంకర్ సుమ Anchor Suma వ్యాఖ్యతగా వ్యవహరించారు.
అయితే... జనవరి 15న ఈ ప్రోగ్రామ్ టెలికాస్ట్ కాబోతోంది. తాజాగా ప్రోమోను విడుదల చేశారు. ప్రొమో చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. ఎందుకంటే తన ఎవర్ గ్రీన్ మూవీ ‘గీతాంజలి’లోని పాపులర్ సీన్, డైలాగ్ ను నాగార్జున బుల్లితెరపై రిపీట్ చేయడం ఫ్యాన్స్ కు సర్ ప్రైజింగ్ గా మారింది.
యాంకర్ సుమ నాగార్జునతో మాట్లాడుతున్నసమయంలో ‘గీతాంజలి’ మూవీలోని నాగార్జున - గిరిజ మధ్య ఎమోషనల్ సన్నివేశం (అదే ఏ) చేయాలని కోరింది. ఇందుకు నాగ్ సుమతోనే ఆ సీన్ ను వేదికపై రిపీట్ చేశారు. ‘నాకు ఎందుకు చెప్పలేదంటూ’ సుమ అడిగిన ప్రశ్నకు... నాగ్ చెప్పిన డైలాగ్ డెలివరీ అప్పటి రోజులకు తీసుకెళ్తొంది.
మొత్తానికి నాగార్జున - సుమ మధ్య జరిగిన Geethanjali మూవీ సీన్ ప్రోమోలో ఆసక్తికరంగా మారింది. ఇక ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి దాదాపు 35 ఏళ్లు పూర్తవుతోంది. మణిరత్నం దర్శకత్వం, నాగార్జున -గిరిజ జంటగా నటించిన ‘గీతాంజలి’ 1989లో విడుదలైంది. 150 రోజులు థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా ఆడింది.
‘గీతాంజలి’ మూవీ జాతీయ అవార్డుతో పాటు ఆరు నంది అవార్డులను గెలుచుకుంది. హిందీలో యాద్ రాఖేగీ దునియాగా 1992లో రీమేక్ అయ్యింది. నాగార్జున కెరీర్ లోనే ఇది బెస్ట్ మూవీ. ఇదిలా ఉంటే... ‘నా సామిరంగ’ మూడురోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్ లో అల్లరి నరేశ్, రాజ్ తరుణ్, నాగార్జున, ఆషికా రంగనాథ్ బిజీగా ఉన్నారు.