అతడితో టాలీవుడ్ హీరోయిన్ వివాహేతర సంబంధం, ఫోన్ కాల్స్ లీక్.. భర్తని బెదిరిస్తూ 25 లక్షలు స్వాహా

First Published Mar 11, 2024, 1:26 PM IST

ప్రముఖ బుల్లితెర నటి అడ్డాల ఐశ్వర్య తాజాగా వివాదంలో నిలిచింది. అడ్డాల ఐశ్వర్య పలు టీవీ సీరియల్స్ లో కథానాయికగా నటిస్తోంది. ఆమె వైవాహిక జీవితంపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ప్రముఖ బుల్లితెర నటి అడ్డాల ఐశ్వర్య తాజాగా వివాదంలో నిలిచింది. అడ్డాల ఐశ్వర్య పలు టీవీ సీరియల్స్ లో కథానాయికగా నటిస్తోంది. ఆమె వైవాహిక జీవితంపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఈ ఆరోపణలు చేస్తున్నది ఎవరో కాదు.. స్వయంగా ఆమె భర్తే. 

అడ్డాల ఐశ్వర్య టివి సీరియల్స్ లో నటిస్తూ.. కొన్ని చిన్న చిత్రాల్లో హీరోయిన్ గా కూడా నటించింది. నీ రూటే సపరేటు, ఈ సినిమా సూపర్ హిట్ గ్యారెంటీ, త్రిముఖి లాంటి చిత్రాల్లో అడ్డాల ఐశ్వర్య హీరోయిన్ గా నటించింది. గత ఏడాది సెప్టెంబర్ లో అడ్డాల ఐశ్వర్య మాట్రిమోనీ సంస్థ ద్వారా శ్యామ్ కుమార్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. 

కొంతకాలం ఈ జంట బాగానే ఉన్నారు. ఆ తర్వాత తన భార్య రియల్టర్ కరణం రమేష్ బాబు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు శ్యామ్ కుమార్ ఆరోపిస్తున్నారు. ఈ నీఛమైన పని ఏంటని ప్రశ్నిస్తే తనపై లేనిపోని కేసులు పెడతానని బెదిరిస్తోంది అంటూ శ్యామ్ కుమార్ మీడియాకి తెలిపారు. రమేష్ బాబుతో ఐశ్వర్య మాట్లాడిన ఫోన్ కాల్స్ ని కూడా శ్యామ్ కుమార్ బయట పెట్టారు. 

ఐశ్వర్య బిహేవియర్ తో తన ఫ్యామిలీ నరకం అనుభవిస్తోందని శ్యామ్ కుమార్ వాపోయాడు. ఇప్పటి వరకు నా దగ్గర ఐశ్వర్య 25 లక్షలు కాజేసినట్లు అతడు ఆరోపిస్తున్నాడు. గట్టిగా అడిగితే తనకి విడాకులు కావాలని కూడా బెదిరిస్తోంది అని ఆరోపిస్తున్నాడు. 

శ్యామ్ కుమార్ తన భార్య వేధింపులు తట్టుకోలేకే మీడియా ముందుకు వచ్చినట్లు పేర్కొన్నాడు. ఆమెపై కేసు పెట్టేందుకు కూడా సిద్ధం అవుతున్నట్లు శ్యామ్ కుమార్ తెలిపాడు. శ్యామ్ కుమార్ ఆరోపణలో వాస్తవం ఎంత  అనే విషయం విచారణలో తేలాల్సి ఉంది. 

తన భర్త ఆరోపణలపై అడ్డాల ఐశ్వర్య ఇంకా స్పందించలేదు. ప్రస్తుతం ఆమె అమ్మాయిగారు, పలుకే బంగారమాయెనా, అల వైకుంఠపురం టీవీ సీరియల్స్ లో నటిస్తోంది. 

click me!