తనేమీ బాధపడదు.. ఎందుకంటే నువ్వు నాకెంతో, తనకి కూడా అంతే. ఆ మాట తనే చెప్పింది అంటాడు విక్రమ్. గెలిచాను చూసావా అన్నట్లుగా లాస్యకి సైగ చేస్తుంది రాజలక్ష్మి. ఇక చేసేదేమీ లేదని అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. తర్వాత రాజ్యలక్ష్మి కి ఫోన్ చేసి వాళ్ళిద్దర్నీ గదిలోకి పంపించేస్తుంటే నువ్వు చేతులెత్తేసావేమో, శోభనం జరిగిపోతుందేమో అని కంగారు పడ్డాను. కానీ చివరి నిమిషంలో భలే ట్విస్ట్ ఇచ్చావు అంటూ మెచ్చుకుంటుంది లాస్య. ఇది నా సామ్రాజ్యం, ఇక్కడ అందరి తలరాతలు నేనే రాసేది. ఈ రాజ్యంతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో అందరూ తెలుసుకోవాలి.