నటుడు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, ఆ వేడుకకు హాజరైన నటి త్రిష ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. ప్రేమ గురించి ఆమె హింట్ ఇచ్చింది. ఇప్పుడిది రచ్చ రచ్చ అవుతోంది.
తమిళనాడు ముఖ్యమంత్రిగా నటుడు విజయ్ ప్రమాణ స్వీకారోత్సవం చెన్నై నెహ్రూ స్టేడియంలో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు చాలామంది సెలబ్రిటీలు వచ్చారు. కానీ, అందరి దృష్టినీ ఆకర్షించింది మాత్రం నటి త్రిష. ఈ వేడుకకు వచ్చిన త్రిష, నిన్న మీడియాతో మాట్లాడుతూ 'సూపర్ హ్యాపీ' అని చెప్పారు. అంతేకాదు, విజయ్ ప్రమాణం చేస్తున్నప్పుడు త్రిష భావోద్వేగానికి గురై కంటతడి పెట్టిన వీడియోలు కూడా ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి. అయినా, విజయ్ ప్రమాణ స్వీకారం గురించి సోషల్ మీడియాలో త్రిష ఎలాంటి పోస్ట్ పెట్టలేదు.
24
ప్రేమపై త్రిష ఆసక్తికర పోస్ట్
కానీ ఈ రోజు ఉదయం ఆమె ఒక పోస్ట్ పెట్టారు. విజయ్ ప్రమాణ స్వీకారానికి కట్టుకెళ్లిన చీరతోనే ఫొటోషూట్ చేసి, దానికి ఓ క్యాప్షన్ జోడించారు. ఇప్పుడు ఇంటర్నెట్లో ఇదే హాట్ టాపిక్. సముద్రపు ఆకుపచ్చ రంగు చీర, నగల అలంకరణతో త్రిష ఆ వేడుకకు చాలా అందంగా వచ్చారు. వేడుక ముగిశాక, "The love is always louder" (ప్రేమ ఎప్పుడూ గట్టిగానే వినిపిస్తుంది) అనే క్యాప్షన్తో తన ఫొటోలను షేర్ చేశారు.
34
విజయ్పై ప్రేమతోనే ఈ పోస్ట్ పెట్టిందా?
విజయ్ సీఎం అయ్యాక, త్రిష ఇలాంటి పోస్ట్ పెట్టడం.. వాళ్లిద్దరి మధ్య స్నేహం, ప్రేమ గురించి పాత చర్చలను మళ్లీ రేపింది. 'గిల్లీ', 'తిరుపాచి', 'లియో' వంటి ఎన్నో సినిమాల్లో కలిసి నటించిన ఈ జంట, తమిళ సినిమా ఫేవరెట్ ఆన్-స్క్రీన్ జోడీలలో ఒకటి. విజయ్కు విడాకులు అంటూ వార్తలు రావడం మొదలైనప్పటి నుంచి, త్రిష పేరును కూడా కలిపి చాలామంది మాట్లాడుతున్నారు. కొందరు రాజకీయ నాయకులు కూడా ఈ బంధం గురించి మాట్లాడారు. కానీ, ఈ వదంతులపై విజయ్, త్రిష ఇద్దరూ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. ఇటీవల జరిగిన ఏజీఎస్ కుటుంబ వివాహ వేడుకలో ఇద్దరూ కలిసి పాల్గొనడం పెద్ద వార్త అయింది. ఇప్పుడు పెట్టిన పోస్ట్ వీరి మధ్య ప్రేమని తెలియజేస్తుందా? ఆ ఉద్దేశ్యంతోనే ఆమెఈ పోస్ట్ పెట్టిందా అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే నిన్నటి ఈవెంట్కి త్రిష వెళ్లినప్పుడు అభిమానులు అరుపులతో హోరెత్తించారు. విజయ్ వచ్చినప్పటి కంటే త్రిష వచ్చినప్పుడే ఎక్కువ అరుపులు వినిపించడం విశేషం. దీంతో తనపై అభిమానులకు ఉన్న ప్రేమని ఈ రకంగా వ్యక్తం చేసిందా అనే టాక్ కూడా వినిపిస్తోంది.
విజయ్ ప్రమాణ స్వీకార వేడుకకు ఆయన తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్, తల్లి శోభా చంద్రశేఖర్ ఇద్దరూ హాజరయ్యారు. మాతృదినోత్సవం రోజే తన కొడుకు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం చాలా భావోద్వేగంగా ఉందని శోభా చంద్రశేఖర్ చెప్పారు. తమిళ వెట్రి కళగం (TVK) పార్టీ 108 స్థానాల్లో గెలిచి తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీని ద్వారా డీఎంకే, ఏఐఏడీఎంకే అనే రెండు ద్రావిడ పార్టీల పాలనకు విజయ్ ముగింపు పలికారు. ఇప్పటివరకు ఈ రెండు ద్రావిడ పార్టీలే మార్చి మార్చి అధికారాన్ని చేపట్టాయి. ఇప్పుడు ఆ రెండు పార్టీలను ప్రతిపక్షాలుగా మార్చి విజయ్ ఒక విప్లవాన్ని సృష్టించారు.