తల అజిత్ (Ajith Kumar) తాజాగా హీరోగా నటించిన యాక్షన్ సినిమా 'విడా ముయర్చి’. తెలుగులో 'పట్టుదల’ (Pattudala Movie) పేరుతో విడుదల చేశారు. త్రిష హీరోయిన్. యాక్షన్ కింగ్ అర్జున్, రెజీనా ప్రధాన పాత్రలు పోషించారు. మగిళ్ తిరుమేని (Magizh Thirumeni) దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది.
సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా వాయిదా పడి ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్, యాక్షన్ జానర్కు కేరాఫ్ అయిన అజిత్ 'పట్టుదల’ తో విజయం సాధించాడని ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఈ క్రమమంలో ఫ్యాన్స్ తో కలిసి సినిమా చూసి వస్తున్న త్రిష షాకింగ్ కామెంట్స్ చేసింది.