Trisha and Parthiban Controversy: ఒక అవార్డుల కార్యక్రమంలో నటుడు పార్థిబన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నటి త్రిష గట్టిగా బదులిచ్చారు. ఆ వివరాలు ఈ గ్యాలరీలో చూద్దాం.
ఒక తమిళ మీడియా అవార్డుల వేడుకలో, నటుడు పార్థిబన్.. త్రిషను కించపరిచేలా మాట్లాడటం వివాదంగా మారింది. దీనిపై ఇప్పుడు త్రిష గట్టిగా బదులిచ్చారు. పార్థిబన్ పేరు గానీ, విషయం తెలిసిన వాళ్లకు అర్థమయ్యేలా ఆమె పోస్ట్ ఉంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'X' ద్వారా త్రిష తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఆమె పోస్ట్ కోలీవుడ్లో కలకలం రేపింది.
24
స్క్రీన్పై త్రిష ఫోటో
ఓ స్టేజీపై మాట్లాడుతున్నప్పుడు, యాంకర్లు ఒక్కో నటుడి గురించి, వారి పాత్రల గురించి పార్థిబన్ను అడిగారు. అప్పుడు 'పొన్నియిన్ సెల్వన్' సినిమాలోని త్రిష 'కుందవై' పాత్ర గురించి ప్రశ్నించారు. అదే సమయంలో, వెనుక స్క్రీన్పై త్రిష ఫోటో కూడా చూపించారు. దీనికి పార్థిబన్ ఇచ్చిన సమాధానమే వివాదానికి కారణమైంది.
34
ఇంట్లోనే ఉండమని చెప్పడం మంచిది
"కుందవైని ఇంట్లోనే ఉండమని చెప్పడం మంచిది. ఆమె బయటకు రాకుండా ఉంటేనే బెటర్. బయటకు వస్తే చాలా సమస్యలు వస్తాయి" అని పార్థిబన్ అన్నారు. ఇటీవల నిర్మాత కల్పాతి ఎస్. సురేష్ కొడుకు పెళ్లి రిసెప్షన్కు విజయ్, త్రిష కలిసి హాజరయ్యారు. దీన్ని ఉద్దేశించే పార్థిబన్ అలా మాట్లాడారని విమర్శలు వచ్చాయి. విజయ్ భార్య సంగీత, మరో నటితో సంబంధం ఉందంటూ విడాకుల కోసం కేసు వేశారని, ఆ నటి త్రిషనే అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. విజయ్, త్రిష కలిసి కనిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
పార్థిబన్ వ్యాఖ్యలకు త్రిష గట్టి కౌంటర్ ఇచ్చారు. "ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో, ఒక వ్యక్తి అసిస్టెంట్ అడగడం వల్లే నా పేరు, ఫోటో వాడినట్లు నిర్వాహకులు చెప్పారు. మైక్లో మాట్లాడినంత మాత్రాన ఒక అభిప్రాయం తెలివైనదిగానో, ఫన్నీగానో అయిపోదు. అది తెలివితక్కువతనాన్ని గట్టిగా అరిచి చెప్పినట్లు అవుతుంది. నాసిరకమైన మాటలు మాట్లాడేవారి గురించే ఎక్కువ చెబుతాయి కానీ, ఎవరిని అన్నారో వారి గురించి కాదు" అని త్రిష 'X'లో పోస్ట్ చేశారు. దీని తర్వాత పార్థిబన్ తన వ్యాఖ్యలకు త్రిషకు క్షమాపణ చెబుతూ ఆడియో విడుదల చేయడం గమనార్హం.