అందంలో మాజీ ప్రపంచ సుందరినే డామినేట్‌ చేస్తున్న త్రిష.. బ్లాక్‌ శారీలో మైండ్‌ బ్లాక్‌ చేస్తున్న ఫోటోలు

First Published Sep 24, 2022, 10:05 AM IST

త్రిష చాలా కాలంగా తర్వాత హైదరాబాద్‌లో మెరిసింది. ఈ బ్యూటీ తెలుగు ఆడియెన్స్ ని అలరించింది. తరగని అందంతో అభిమానులను కనువిందు చేసింది. `పొన్నియిన్‌ సెల్వన్‌` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో హైలైట్‌గా నిలిచింది. 
 

త్రిష.. అందం ఏమాత్రం తరగడం లేదు. `అతడు` సినిమా టైమ్‌లో ఎలా ఉందో, ఇప్పుడూ అలానే ఉంది. ఇంకా చెప్పాలంటే ఆమె అందం మరింత పెరిగింది. మరింత యంగ్‌గానూ అనిపిస్తుంది. నాలుగు పదుల వయసులోనూ త్రిష ఇంత అందంగా ఉండటం ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది. 

తాజాగా ఈ క్యూట్‌ బ్యూటీ మణిరత్నం రూపొందించిన `పొన్నియిన్‌ సెల్వన్‌ 1`లో నటించిన విషయం తెలిసిందే. విక్రమ్‌, కార్తి,జయంరవి, ఐశ్వర్యా రాయ్‌, త్రిషలు ప్రధాన పాత్రలుపోషించారు. శరత్ కుమార్‌, సుహాసిని వంటి వారు ఇతర కీలక పాత్రలు పోషించారు. సెప్టెంబర్‌ 30న ఈ చిత్రాన్ని హిందీతోపాటు సౌత్‌ లాంగ్వేజెస్‌లో పాన్‌ ఇండియా చిత్రంగా విడుదల చేస్తున్నారు. 
 

చిత్ర ప్రమోషన్‌లో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. ఇందులో ఆమె బ్లాక్‌ శారీలో మెరవడం విశేషం. నాజుకూ అందంతో కట్టపడేస్తుంది త్రిష. నల్ల చీరలో ఆమె అందం మరింత పెరిగిపోవడం విశేషం. దీంతో ఈవెంట్‌కే హైలైట్‌గా నిలిచింది. 
 

అంతేకాదు ఇందులో మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్‌ని డామినేట్ చేయడం విశేషం. ఐశ్వర్యారాయ్‌ కూడా ఈ ఈవెంట్‌లో పాల్గొంది. ఆమె రెడ్‌ డ్రెస్‌లో మెరిసింది. అయితే త్రిష, ఐశ్వర్యరాయ్‌ ఇద్దరిలో త్రిషనే అందంగా కనిపించడం విశేషం. ఓ రకంగా ప్రపంచ సుందరినే డామినేట్‌ చేసిందని అంటున్నారు త్రిష ఫ్యాన్స్. 
 

ఈ సందర్భంగా త్రిష మాట్లాడుతూ చాలా ఏళ్ల తర్వాత హైదరాబాద్ కి రావడం, ఇలా తెలుగు ఆడియెన్స్ తో మాట్లాడటం చాలా సంతోషంగా ఉందని తెలిపింది. ఇందులో అద్బుతమైన పాత్ర ఇచ్చిన మణిరత్నంకి థ్యాంక్స్‌ చెప్పింది. అలాగే విక్రమ్‌, కార్తి, రవి, ఐశ్వర్య వంటి పెద్ద స్టార్స్ తో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉందని పేర్కొంది త్రిష. 
 

త్రిష చివరగా బాలకృష్ణ `లయన్‌` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. `వర్షం`, `నువ్వొస్తానంటే నేనొద్దంటానా`, `అతడు`, `అల్లరి బుల్లోడు`, `పౌర్ణమి`, `స్టాలిన్‌`, `సైనికుడు`, `ఆడవారి మాటలకు అర్థాలు వేరులే`, `కృష్ణ`, `బుజ్జిగాడు`, `కింగ్‌`, `శంఖం`, `నమో వెంకటేశా`, `తీన్‌ మార్‌`, `బాడీగార్డ్`, `దమ్ము`, `లయన్‌` చిత్రాల్లో నటించి మెప్పించింది త్రిష.  
 

త్రిష చాలా కాలంగా తర్వాత హైదరాబాద్‌లో మెరిసింది. ఈ బ్యూటీ తెలుగు ఆడియెన్స్ ని అలరించింది. తరగని అందంతో అభిమానులను కనువిందు చేసింది. `పొన్నియిన్‌ సెల్వన్‌` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో హైలైట్‌గా నిలిచింది. 

త్రిష చాలా కాలంగా తర్వాత హైదరాబాద్‌లో మెరిసింది. ఈ బ్యూటీ తెలుగు ఆడియెన్స్ ని అలరించింది. తరగని అందంతో అభిమానులను కనువిందు చేసింది. `పొన్నియిన్‌ సెల్వన్‌` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో హైలైట్‌గా నిలిచింది. 

click me!