దీనికి శ్రీముఖి యాంకర్గా వ్యవహరిస్తుండా, శేఖర్ మాస్టర్, అనసూయ జడ్జ్ లుగా ఉన్నారు. లేడీ టీమ్కి అనసూయ, బాయ్స్ టీమ్కి శేఖర్ మాస్టర్ లీడర్స్ గా వ్యవహరిస్తుంటారు. ఇందులో చాలా వరకు బిగ్ బాస్ కంటెస్టెంట్లు, పాపులర్ టీవీ కమెడియన్లు, సీరియల్ నటులుపాల్గొంటున్నారు. రీతూ చౌదరి, విష్ణుప్రియా వంటి యాంకర్లు కూడా ఉన్నారు. లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్లో ఈ షో టాప్లో ఉంది. దీనికి అర్బన్, రూరల్ కలిపి 4.93 రేటింగ్ వచ్చింది. అర్బన్లో 5.38 రేటింగ్ రావడం విశేషం. ఇది నెంబర్ వన్ స్థానంలో ఉంది. అనసూయ, శ్రీముఖి ఉండటమే ఈ క్రేజ్కి కారణమని నెటిజన్లు అంటున్నారు.