మరో స్టార్‌ డైరెక్టర్‌కు కరోనా.. షాక్‌లో టాలీవుడ్‌!

Published : Aug 03, 2020, 03:44 PM ISTUpdated : Aug 03, 2020, 03:50 PM IST

తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. ఇన్నాళ్లు బాలీవుడ్ ప్రముఖులకు మాత్రమే కరోనా పాజిటివ్ వస్తున్న వార్తలు వినిపిస్తుండగా తాజాగా టాలీవుడ్‌ ఇండస్ట్రీలోనూ పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా లాక్‌ డౌన్‌ సడలింపులతో వైరస్ విపరీతంగా వ్యాప్తిచెందుతోంది.

PREV
15
మరో స్టార్‌ డైరెక్టర్‌కు కరోనా.. షాక్‌లో టాలీవుడ్‌!

ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల దర్శక ధీరుడు రాజమౌళి, తనకు తన కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని ట్వీట్  చేయటంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ అంతా ఉలిక్కిపడింది.

ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల దర్శక ధీరుడు రాజమౌళి, తనకు తన కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని ట్వీట్  చేయటంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ అంతా ఉలిక్కిపడింది.

25

తాజాగా మరో స్టార్‌ డైరెక్టర్‌కు కరోనా  పాజిటివ్‌ అని నిర్దారణ అయ్యింది. సెన్సేషనల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న తేజ కరోనా బారిన పడ్డారు. ఇటీవల ఓ వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌ కోసం ముంబైకి వెళ్లివచ్చిన సందర్భంగా ఆయనకు వైరస్‌ సోకి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

తాజాగా మరో స్టార్‌ డైరెక్టర్‌కు కరోనా  పాజిటివ్‌ అని నిర్దారణ అయ్యింది. సెన్సేషనల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న తేజ కరోనా బారిన పడ్డారు. ఇటీవల ఓ వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌ కోసం ముంబైకి వెళ్లివచ్చిన సందర్భంగా ఆయనకు వైరస్‌ సోకి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

35

తేజకు పాజిటివ్‌ రావటంతో ఆయన కుటుంబ సభ్యులంతా కరోనా టెస్ట్‌లు చేయించుకున్నారు. అయితే ఆయన కుటుంబ సభ్యులకు నెగెటివ్‌ రావటంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం తేజ వైధ్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు.

తేజకు పాజిటివ్‌ రావటంతో ఆయన కుటుంబ సభ్యులంతా కరోనా టెస్ట్‌లు చేయించుకున్నారు. అయితే ఆయన కుటుంబ సభ్యులకు నెగెటివ్‌ రావటంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం తేజ వైధ్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు.

45

ఇటీవల సీత సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తేజ తరువాత గోపిచంద్‌, రానాలు హీరోలుగా రెండు సినిమాలు ప్రకటించాడు. కరోనా ప్రభావం తగ్గిన తరువాత ఆ సినిమాలను సెట్స్‌ మీదకు తీసుకువచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

ఇటీవల సీత సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తేజ తరువాత గోపిచంద్‌, రానాలు హీరోలుగా రెండు సినిమాలు ప్రకటించాడు. కరోనా ప్రభావం తగ్గిన తరువాత ఆ సినిమాలను సెట్స్‌ మీదకు తీసుకువచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

55

అయితే ప్రస్తుతం ఓటీటీలు రాజ్యమేలుతుండటంతో తాను కూడా డిజిటల్‌ రంగంలో సత్తా చాటేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో వెబ్‌ సిరీస్‌ను డైరెక్ట్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు. అందులో భాగంగానే ఆయన ముంబైకి వెళ్లొచ్చారు.

అయితే ప్రస్తుతం ఓటీటీలు రాజ్యమేలుతుండటంతో తాను కూడా డిజిటల్‌ రంగంలో సత్తా చాటేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో వెబ్‌ సిరీస్‌ను డైరెక్ట్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు. అందులో భాగంగానే ఆయన ముంబైకి వెళ్లొచ్చారు.

click me!

Recommended Stories