Reshma Rathore: సినిమాలకు గుడ్‌ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కుతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌.. డేరింగ్‌ స్టెప్‌

Published : Sep 01, 2026, 08:57 PM IST

Reshma Rathore: సినిమా గ్లామర్, స్టార్‌డమ్ వదులుకోవడం ఎవరికైనా కష్టమే. కానీ, ఓ హీరోయిన్ మాత్రం నటనకు గుడ్‌బై చెప్పి, ఏకంగా సుప్రీంకోర్టు మెట్లు ఎక్కడానికి రెడీ అయ్యింది.

PREV
17
యాక్టింగ్‌కి గుడ్ బై చెప్పిన టాలీవుడ్‌ హీరోయిన్‌

సినిమా రంగంలో గ్లామర్, పేరుప్రఖ్యాతలు ఉంటాయి. కెమెరా ముందుకొచ్చి చప్పట్లు కొట్టించుకున్న వాళ్లు ఆ ప్రపంచాన్ని వదిలి వెళ్లడం చాలా కష్టం. అవకాశాలు ఉన్నా, లేకపోయినా వదల్లేరు. అలాంటి పరిస్థితి వస్తే అది ఎంతో స్ట్రగుల్‌తో కూడుకొన్నదే అవుతుంది. కానీ, తెలుగు అందం రేష్మా రాథోర్‌ మాత్రం 'గ్లామర్ అనేది క్షణికం, న్యాయం కోసం పోరాడటమే అసలైన జీవితం' అని నిరూపిస్తున్నారు రేష్మ. ఆమె యాక్టింగ్‌కి గుడ్‌ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కేందుకు రెడీ అయ్యింది.

27
ఈ రోజుల్లో మూవీతో హీరోయిన్‌గా పరిచయమైన రేష్మా రాథోర్‌

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన రేష్మాకు చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి ఎక్కువ. బాలనటిగా కెమెరా ముందుకొచ్చిన ఆమె, వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీలో చదువుతుండగా దర్శకుడు మారుతి కంటపడ్డారు. ఆయన తీసిన యూత్‌ఫుల్ హిట్ 'ఈ రోజుల్లో' సినిమాతో రేష్మా హీరోయిన్‌గా పరిచయమయ్యారు. తొలి సినిమానే బ్లాక్‌బస్టర్ అవ్వడంతో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి.

37
వెంకటేష్‌, ఉదయ్‌ కిరణ్‌ సినిమాల్లో రేష్మ
విక్టరీ వెంకటేష్ 'బాడీగార్డ్' సినిమాలో హీరోయిన్ స్నేహితురాలిగా, దివంగత నటుడు ఉదయ్ కిరణ్‌తో కలిసి 'జై శ్రీరామ్' సినిమాలోనూ రేష్మా నటించి మెప్పించారు. తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం భాషల్లోనూ ఆమె నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
47
నటిగా సక్సెస్ కాకపోవడంతో లా వైపు రేష్మ చూపులు
2017 వరకు చాలా సినిమాల్లో నటించినా, రేష్మాకు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం దక్కలేదు. దీంతో ఆమెకు సినీ రంగంలోని అనిశ్చితి అర్థమైంది. అప్పుడే ఓ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. తన తల్లి రాధాబాయి రాథోడ్ (హైకోర్టు లాయర్) బాటలో నడవాలని నిర్ణయించుకున్నారు. మేకప్ కిట్ పక్కనపెట్టి, న్యాయశాస్త్ర పుస్తకాలు చేతపట్టారు.
57
సుప్రీంకోర్ట్ లాయర్‌గా మారిన రేష్మా రాథోర్‌
సినిమా డైలాగుల కన్నా రాజ్యాంగంలోని ఆర్టికల్స్ ఆమెకు బాగా నచ్చాయి. న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసి, లాయర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. తన తెలివితేటలు, వాదనా పటిమతో అనతికాలంలోనే దిల్లీలోని సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేసే స్థాయికి ఎదిగారు. ఒకప్పుడు సెట్స్‌లో లైట్ల మధ్య ఉన్న అమ్మాయి, ఇప్పుడు కోర్టులో న్యాయం కోసం వాదిస్తుండటం విశేషం.
67
రాజకీయాలపై రేష్మాకి ఇంట్రెస్ట్
రేష్మా కేవలం కోర్టులకే పరిమితం కాలేదు. ఆమెకు రాజకీయాలపై కూడా ఆసక్తి ఉంది. అంతేకాకుండా, సామాజిక సేవలోనూ చురుకుగా పాల్గొంటున్నారు. నటిగా ప్రజలను అలరించిన రేష్మా, ఇప్పుడు లాయర్‌గా వారి హక్కుల కోసం పోరాడుతున్నారు.
77
రేష్మ సక్సెస్‌ స్టోరీ
'సినిమా ప్రపంచం నుంచి సుప్రీంకోర్టు వరకు' రేష్మా ప్రయాణం కేవలం ఒక మార్పు కాదు, అది ఒక దృఢ సంకల్పం సాధించిన విజయం. సాధించాలనే పట్టుదల ఉంటే గ్లామర్ ప్రపంచం నుంచి న్యాయ ప్రపంచం వరకు ఎక్కడైనా గెలవచ్చని ఆమె నిరూపించారు.
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories