బాలీవుడ్ సినిమాలను డైరెక్ట్ చేసిన తెలుగు దర్శకులు

First Published Aug 14, 2019, 12:45 PM IST

టాలీవుడ్ సినిమాలకు ప్రస్తుతం నేషనల్ వైడ్ గా మంచి మార్కెట్ ఏర్పడింది. దీంతో బాలీవుడ్ స్టార్ హీరోలు తెలుగు దర్శకులతో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటివరకు బాలీవుడ్ సినిమాలను డైరెక్ట్ చేసిన కొంతమంది తెలుగు దర్శకులపై ఓ లుక్కేద్దాం పదండి. 

టాలీవుడ్ ఫెమస్ దర్శకుల లిస్ట్ తీస్తే అందులో ఆదుర్తి సుబ్బారావు టాప్ లో ఉంటారని చెప్పవచ్చు. అప్పట్లో బాలీవుడ్ లో అత్యధిక సినిమాలను డైరెక్ట్ చేసిన సుబ్బారావు మూగమనసులు సినిమాను మిలన్ పేరుతో రీమేక్ చేశారు. సునీల్ దత్ - నూతన్ - జమునా ప్రాణ్ వంటి స్టార్ యాక్టర్స్ నటించిన ఆ సినిమా అక్కడ కూడా సక్సెస్ అయ్యింది.. అనంతర ఆదుర్తి బాలీవుడ్ లో 10కి పైగా సినిమాలను డైరెక్ట్ చేశారు.
undefined
పూరి జగన్నాథ్: బద్రి సినిమాతో దర్శకుడిగా పరిచయమైన పూరి నెక్స్ట్ అదే సినిమాను బాలీవుడ్ లో షార్ట్: ద ఛాలెంజ్ టైటిల్ తో తుషార్ కపూర్ ని హీరోగా పెట్టి రీమేక్ చేశాడు. అలాగే 2011లో అమితాబ్ బచ్చన్ తో బుడ్డా హోగా తేరా బాప్ అనే సినిమా చేశాడు.
undefined
రంగీలా - సత్య సినిమా తరువాత ఒక బాలీవుడ్ ని ఆకర్షించిన తెలుగు టాప్ డైరెక్టర్ గా రామ్ గోపాల్ వర్మ ఎంతో క్రేజ్ తెచ్చుకున్నాడు. బాలీవుడ్ లో 30కి పైగా సినిమాలు చేసిన ఆర్జీవీ 10 బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్నాడు.
undefined
తేజ: తెలుగులో ననువ్వు నేను సినిమాతో సక్సెస్ అందుకోగానే అదే కథను బాలీవుడ్ లో యే దిల్ అని రీమేక్ చేశాడు. తుషార్ కపూర్ హీరోగా నటించిన ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.
undefined
కృష్ణ వంశీ: సముద్రం సినిమాతో బాలీవుడ్ ని ఆకర్షించిన కృష్ణవంశీ ఆ సినిమాను శక్తి: ద పవర్ పోరుతో బాలీవుడ్ లో రీమేక్ చేశాడు. కరిష్మా కపూర్ - సంజయ్ కపూర్ - నానా పటేకర్ వంటి స్టార్స్ నటించిన ఆ సినిమాలో షారుక్ ఖాన్ కూడా స్పెషల్ పాత్రలో ఎంట్రీ ఇచ్చాడు. కానీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద క్లిక్కవ్వలేకపోయింది.
undefined
సందీప్ వంగ: అర్జున్ రెడ్డి సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకొని మళ్ళీ అదే రేంజ్ లో బాలీవుడ్ లో కూడా కబీర్ సింగ్ గా అర్జున్ రెడ్డి కథను రీమేక్ చేసిన సందీప్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
undefined
100 సినిమాలకు పైగా దర్శకత్వం వహించిన సీనియర్ డైరెక్టర్: కె.రాఘవేంద్ర రావ్ బాలీవుడ్ లో కూడా పలు సినిమాలను తెరకెక్కించారు. మొదట 1980లో జితేంద్రతో వేటగాడు సినిమాను నిషాన గా బాలీవుడ్ లో రీమేక్ చేశారు.
undefined
క్రిష్ (రాధాకృష్ణ జాగర్లమూడి) మంచి సందేశాత్మక చిత్రాలతో బాలీవుడ్ ని సైతం ఆకర్షించాడు. మొదట 2015లో అక్షయ్ కుమార్ తో గబ్బర్ ఈజ్ బ్యాక్ అనే సినిమాను తెరకెక్కించాడు. ఆ తరువాత కంగనా మణికర్ణిక సినిమాకు కూడా దర్శకత్వం వహించాడు.
undefined
కె రాఘవేంద్ర రావ్ తనయుడు ప్రకాష్ కోవెలమూడి ఇటీవల కంగనా తో మెంటల్ హై క్యా అనే సినిమాను డైరెక్ట్ చేసి బాలీవుడ్ సినీ ప్రముఖులను ఆకర్షించాడు. తెలుగులో అనగనగ ఒక ధీరుడు - సైజ్ జీరో వంటి సినిమాలు చేసిన ప్రకాష్ మొదటి సక్సెస్ మాత్రం బాలీవుడ్ లోనే దక్కింది.
undefined
తెలుగు చిత్ర పరిశ్రమలో డిఫరెంట్ మేకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న బాబు మనవూరి పాండవులు అనే సినిమాను 1980లో హమ్ పాంచ్ అనే పేరుతో బాలీవుడ్ లో రీమేక్ చేశారు. ఆ తరువాత కూడా పలు బాలీవుడ్ సినిమాలను డైరెక్ట్ చేశారు.
undefined
నువ్వే కావాలి సినిమాతో స్టార్ డైరెక్టర్ గా క్లిక్కయిన దర్శకుడు కె.విజయభాస్కర్ ఆ తరువాత అదే కథను రితేష్ దేశ్ ముఖ్ - జెనీలియా లతో తుజే మేరీ కసమ్ అనే టైటిల్ తో రీమేక్ చేశారు.
undefined
click me!