ప్రేమించి పెళ్లి చేసుకుని మధ్యలో విడిపోయిన టాలీవుడ్ జంటలు... నాగ్ నుండి నాగ చైతన్య వరకు..

First Published Oct 5, 2021, 12:20 PM IST

ప్రేమలు, ఇష్టాలు, అభిప్రాయాలు ఎప్పుడూ ఒకలా ఉండవు. ఒకప్పుడు విడిచి ఉండలేము అనుకున్నవారు, కూడా విడాకులు కావాలని విడిపోతారు. ప్రేమ పెళ్లిళ్లు చేసుకొని విడాకులు తీసుకున్న టాలీవుడ్ జంటలు ఎవరో ఓ లుక్కేయండి..

 పవన్ కల్యాణ్  గుజరాత్ కి చెందిన రేణూ దేశాయ్‌ని 2009లో ప్రేమ వివాహాం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు కాగా, 2012లో విడాకులు తీసుకొని విడిపోయారు. అనంతరం పవన్ రష్యన్ యువతి అన్నా లెజినోవాను వివాహం చేసుకున్నారు. 
 


శరత్ బాబు, లేడీ కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ రామా ప్రభ1974లో ప్రేమ వివాహం చేసుకున్నారు.  తర్వాత వీరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో 1988లో విడిపోయారు. ఇప్పటికీ వీరిద్దరూ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటారు. 

లోకనాయకుడు కమల్ హాసన్  1978లో డాన్సర్ వాణి గణపతినివివాహం చేసుకున్నారు. పదేళ్ల కాపురంలో వీరికి ఓ అబ్బాయికి కూడా పుట్టాడని సమాచారం. అయితే 1988లో వాణికి విడాకులు ఇచ్చేశారు. అనంతరం హీరోయిన్ సారికను కమల్ 1988లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి శృతి హాసన్, అక్షర హాసన్ లు సంతానం.అయితే ఊహించని విధంగా రెండో భార్య సారికకు కూడా 2004లో కమల్ విడాకులు ఇచ్చారు.  గౌతమితో సహజీవనం చేసిన కమల్, ఈ మధ్యన ఆమెకు దూరంగా ఉంటున్నారు. 


ప్రకాష్ రాజ్ తమిళ నటి లలిత కుమారిని ప్రేమించి 1994లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు అమ్మాయిలు.అయితే కొన్ని మనస్పర్థల కారణంగా వీరిద్దరూ 2009లో విడిపోయారు. తర్వాత ప్రకాష్ రాజ్ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ పోనీ వర్మ ని 2010లో రెండో పెళ్లి చేసుకున్నారు. వీరికో పాప ఉంది.

హీరో సిద్దార్థ్ 2003 లో మేఘన అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత కొన్ని కారణాల వలన 2007 లో విడిపోయారు.

అక్కినేని నాగార్జున స్టార్ ప్రొడ్యూసర్ డి.రామానాయుడు కుమార్తె లక్ష్మీతో 1984లో వివాహమైంది. కానీ 1990 లో వీరి బంధం తెగిపోయింది. అనంతరం నాగార్జున హీరోయిన్ అమలను రెండో వవివాహం చేసుకున్నారు. 

హీరో సుమంత్ 2004లో హీరోయిన్ కీర్తి రెడ్డి తో ప్రేమలో పడి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్ల పాటు ఈ జంట జీవితం సాఫీగానే సాగింది. కానీ ఆ తర్వాత ఇద్దరికి విబేధాలు తలెత్తటాయి.  సుమంత్ సోదరి సుప్రియతో కూడా విబేధాలు రావడంతో పెళ్లయిన రెండేళ్లకే 2006లో విడాకులు తీసుకున్నారు.

ఇష్టం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన చరణ్ రెడ్డిని సుప్రియ ప్రేమించి వివాహం చేసుకుంది. కొన్నాళ్ల పాటు ఎంతో అన్యోన్యంగానే ఉన్న ఈ జంట ఓ పాపకి కూడా జన్మనిచ్చారు. అయితే ఆ తర్వాత చరణ్ చెడు వ్యసనాలకు బానిసైపోయాడు. ఎంత చెప్పినా అతని ప్రవర్తనలో మార్పురాకపోవడంతో విడాకులిచ్చేసింది సుప్రియ. ఆమెతో విడిపోయిన తర్వాత కూడా చరణ్‌లో ఎలాంటి మార్పు రాకపోగా, వ్యసనాలకు మరింత దగ్గరై… ప్రాణాలను కోల్పోయాడు.

సమంతతో ప్రేమలో పడిన నాగచైతన్య  2017లో పెళ్లి చేసుకున్నాడు. సమంత కేరళకు చెందిన క్రిస్టియన్ అమ్మాయి. కాగా, చైతు తెలుగబ్బాయి. వీరిద్దరూ పెళ్లి విషయంలో తమ రెండు మత సంప్రదాయాలను పాటించారు.అయితే ఎవ్వరూ ఊహించని విధంగా వీళ్ళు కొద్దిరోజుల క్రితం విడాకులు ప్రకటించారు. 

click me!