కాస్త పైట జారితే... సొల్లు కారుస్తుంటారు.. కరాటే కళ్యాణి బోల్డ్ కామెంట్స్.. ఎవరిగురించంటే...?

First Published Sep 15, 2022, 8:54 PM IST

టాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ లేడీస్ అంటే గుర్తుకువచ్చేవారిలో కరాటే కళ్యాణి ఒకరు.  ఆమె నోరు తెరించందంటే.. అవతలివాళ్లు నోరు మూసుకోవల్సింది. అంత పవర్ ఫుల్ లేడీ.. రీసెంట్ గా  బోల్డ్ కామెంట్స్ చేసింది. మగవారి బుద్ది గురించి వేలెత్తి చూపుతూ.. కామెంట్స్ చేసింది.  

టాలీవుడ్ లోని క్యారెక్టర్ ఆర్టిస్ట్  లో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న నటి కరాటే  కళ్యాణి. వ్యాంప్ క్యారెక్టర్ల‌ంటే  కరాటే కళ్యాణి బాగా గుర్తొస్తుంది. ముఖ్యంగా ఆమె బ్రహ్మానందం కాంబినేషన్ లో నటించి.. బాగా  పాపులారిటీ సంపాదించుకుంది. బాబీ అంటూ  గోముగా పిలిచే ఆ డైలాగ్ ఇప్పటికీ మీమ్స్ లో వాడుతూనే ఉంటారు. ఇక  చాలా సినిమాల్లో కరాటే కల్యాణి అలాంటి పాత్రలే చేసింది. 

ఇక ఆమె రీసెంట్ గా రాజకీయాల్లోకి దిగింది. విమర్షలు పెరగడంతో వాంప్ పాత్రలు వేయడంలేదు కళ్యాణి. రీసెంట్ గా  ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ… ఆమె సంచలన కామెంట్స్ చేసింది.  హరికథలు, పురాణాలు చెబితే రాని గుర్తింపు తనకు వ్యాంప్ క్యారెక్టర్లు చేస్తేనే వచ్చిందని అంటుంది. తాను పైట జారిస్తే మాత్రం ప్రేక్షకులు ఆదరించారు అని పేర్కొంది. 

అంతే కాదు ఇప్పటికీ తాను ఏ షో కు వెళ్ళినా బాబీ అంటూ పిలుస్తారని చెప్పింది. తనను గుర్తు పట్టినందుకు సంతోష‌పడాలో లేదంటే.. త‌న‌కు వ‌చ్చిన ఈ  క్రేజ్‌ వ్యాంప్ పాత్రల వల్ల వచ్చింద‌ని బాధ పడాలో అర్థం కాదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి ఆలోచనలు ఉన్న సమాజంలో ఉన్నామంటూ బాధపడింది కరాటే కళ్యాణి. 
 

ఇక ఇప్పటికీ చాలా సినిమాల్లో వ్యాంప్ పాత్రల్లో నటించింది కల్యాణి. శంకర్ దాదా ఎంబీబీఎస్, ఛత్రపతి సినిమాల్లో  నటించి మెప్పించింది.  నిజానికి కరాటే కల్యాణి హరి కథలు చెబుతూ అంచెలు అంచెలుగా ఎదిగి ఇండస్ట్రీ లో నటిగా ఎదిగింది.136 గంటల పాటు హైదరాబాద్ లో నాన్ స్టాప్ గా హరి కథ చెప్పి లిమ్కా బుక్ ఆఫ్ గున్నిస్ రికార్డు దక్కించుకుంది. 
 

కరాటే కళ్యాణి కూడా ఇప్పుడు మరింత పాపులర్‌ అయ్యారు. హౌజ్‌ నుంచి ఎలిమినేట్‌ అయ్యాక ఆమె ఇంటర్వ్యూల కోసం మీడియా, యూట్యూబ్‌ ఛానెళ్లు వెంటపడ్డారు. దీంతోక్రేజీ నటిగా మారిపోయారు.

తండ్రి వార‌స‌త్వాన్ని అంది పుచ్చుకుని క‌ళ్యాణి కూడా హ‌రిక‌థ‌లు చెప్పేది. అయితే ఆమెకు వ్య‌క్తిగ‌త జీవితం క‌లిసి రాలేదు. ఆమె ప్రేమించిన వ్యాక్తి .. పెళ్ళి చేసుకున్న వ్యాక్తి కూడా మోసం చేయడంతో.. ఓ బాబును దత్తత తీసుకుని పెంచుకుంటుంది. 
 

గ్లామరస్‌ పాత్రలతో ఫేమస్‌ అయిన కరాటే కళ్యాణి ఇటీవల బిగ్‌బాస్‌ 4లో ఇంటిసభ్యురాలిగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా తన జీవితంలోని చేదు జ్ఞాపకాలను గుర్తు చేసి,తన స్ట్రగుల్స్ ని పంచుకుని అందరి చేత కన్నీళ్లు పెట్టించింది.

ఇక క‌ల్యాణి బిగ్ బాస్ ఎంట్రీ  తో రచ్చ రచ్చ చేసింది. తన వాయిస్ తో చాలా మందిఅభిమానులను అలరించింది. ప్రస్తుతం సోషల్ సర్వీస్ తో పాటు.. పొలిటికల్ గా కూడా యాక్టీవ్ గా ఉంటుంది కల్యాణి. బిజెపిలో చేరిన కరాటే కల్యాణి ఆ పార్టీకి వ్యతిరేఖంగా మాట్లాడే వాళ్ల పై నిప్పులు చెరుగుతూ ఉంటుంది. 

తనకు వచ్చిన పాపులారిటీని ఉపయోగించుకోవాలని కళ్యాణి డిసైడ్‌ అయ్యిందట. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. పవన్‌ కళ్యాణ్‌ అండతో బీజేపీలోకిచేరాలని భావిస్తుందట. అందుకుగానూ రంగం సిద్ధం చేసుకుంటుందని సమాచారం.

రాజకీయాలకు అడ్డురావడంతో.. వ్యాంప్ పాత్రలకు. అసలు సినిమాలకే గుడ్ బై చెప్పబోతుందట కళ్యాణి. చాలా ఇంటర్వ్యూలలో ఈ విషయానని ఆమె స్యయంగా వెల్లడించింది. అసలు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆమెకు పెద్దగా పాత్రలు రావడంలేదు. దాంతో పూర్తిగా రాజకీయాలకు పరిమితం కావాలి అని  చూస్తోందట కరాటే కళ్యాణి. 
 

click me!