కూటమిలో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ 2024 ఏపీ ఎన్నికల్లో పోటీ చేశాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేశారు. పవన్ కళ్యాణ్ గెలుపుకోసం మెగా ఫ్యామిలీ మొత్తం రంగంలోకి దిగింది. తమ్ముడు పవన్ కళ్యాణ్ కి ఓటు వేయాలని చిరంజీవి వీడియో బైట్ విడుదల చేశాడు. వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ పిఠాపురంలో ప్రచారం చేశారు.