చిరుతో మూవీ అంటే ఫ్లాపే, భయపడి ఇండస్ట్రీ హిట్ రిజెక్ట్ చేసిన డైరెక్టర్.. మరచిపోలేని గిఫ్ట్ ఇచ్చిన మెగాస్టార్

Published : Apr 07, 2025, 07:27 PM IST

కొంతమంది దర్శకులు అయితే ఒక్కసారి అయినా చిరంజీవి ని డైరెక్ట్ చేయాలి అని కలలు కంటుంటారు. ఒక దర్శకుడు చిరంజీవితో సినిమా అంటే భయపడి ఆఫర్ రిజెక్ట్ చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆ దర్శకుడు ఎవరు ? ఆ చిత్రం ఏంటో ఇప్పుడు చూద్దాం. 

PREV
16
చిరుతో మూవీ అంటే ఫ్లాపే, భయపడి ఇండస్ట్రీ హిట్ రిజెక్ట్ చేసిన డైరెక్టర్.. మరచిపోలేని గిఫ్ట్ ఇచ్చిన మెగాస్టార్
Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని చాలా మంది దర్శకులు ఆసక్తి చూపుతుంటారు. కొంతమంది దర్శకులు అయితే ఒక్కసారి అయినా చిరంజీవి ని డైరెక్ట్ చేయాలి అని కలలు కంటుంటారు. ఒక దర్శకుడు చిరంజీవితో సినిమా అంటే భయపడి ఆఫర్ రిజెక్ట్ చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆ దర్శకుడు ఎవరు ? ఆ చిత్రం ఏంటో ఇప్పుడు చూద్దాం. 

26

చిరంజీవితో సినిమా అనగానే భయపడి క్రేజీ ఆఫర్ ని ఒక స్టార్ డైరెక్టర్ రిజెక్ట్ చేశారట. ఆ దర్శకుడు ఎవరో కాదు సమరసింహారెడ్డి లాంటి ఇండస్ట్రీ హిట్ మూవీ అందించిన బి గోపాల్. ఇంద్ర చిత్రాన్ని తెరకెక్కించే అవకాశం బి గోపాల్ కి దక్కింది. కానీ అంతకు ముందే గోపాల్.. చిరంజీవితో స్టేట్ రౌడీ, మెకానిక్ అల్లుడు లాంటి చిత్రాలు తెరకెక్కించారు. ఇందులో మెకానిక్ అల్లుడు చిత్రం తీవ్రంగా నిరాశ పరిచింది. 

36

రచయిత చిన్ని కృష్ణ.. పరుచూరి బ్రదర్స్ కి ఇంద్ర కథ వినిపించారు. వాళ్ళకి కథ అద్భుతంగా నచ్చింది. అయితే కొన్ని మార్పులు అవసరం. కథని అశ్విని దత్, బి గోపాల్ ఇద్దరికీ వినిపించారు. వాళ్ళకి కథ నచ్చలేదట. దీనితో బి గోపాల్ నేను చేయను అని చెప్పారు. పరుచూరి బ్రదర్స్ ఎక్కడ ఈ కథని చిరంజీవికి చెప్పి ఒప్పిస్తారో ? దర్శకుడిగా నా పేరు చెబుతారో ? అని బి గోపాల్ టెన్షన్ పడుతున్నారు. 

46

కథ నచ్చకపోవడం ఒక కారణం అయితే.. అంతకు ముందే బి గోపాల్ సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు లాంటి ఫ్యాక్షన్ కథలు చేసి ఉన్నారు. మరోసారి ఫ్యాక్షన్ ఎందుకు అనేది ఆయన ఫీలింగ్. దీనికి తోడు చిరంజీవితో తెరకెక్కించిన మెకానిక్ అల్లుడు చిత్రం డిజాస్టర్ అయింది. మరోసారి చిరంజీవితో చెత్త కథతో సినిమా చేస్తే ఫ్లాప్ అవుతుందేమో, విమర్శలు వస్తాయి ఏమో అని బి గోపాల్ భయపడ్డారు. చిరంజీవి గారికి ఈ కథ చెప్పొద్దు, నేను ఈ చిత్రం  చేయలేను అని బి గోపాల్ పరుచూరి బ్రదర్స్ కి చెప్పేశారు. 

56

కానీ చివరికి పరుచూరి గోపాల కృష్ణ బి గోపాల్ ని ఒప్పించారు. ఫ్యాక్షన్ అనేది సక్సెస్ ఫుల్ ఎలిమెంట్. దానిని మరో కోణంలో చూపిస్తే ఎన్నిసార్లు అయినా సక్సెస్ అవుతూనే ఉంటుంది. బాలకృష్ణ వేరు.. చిరంజీవి వేరు.. రొటీన్ గా అనిపించదు అని పరుచూరి గోపాల కృష్ణ.. బి గోపాల్ ని కన్విన్స్ చేశారు. స్టోరీ డిస్కషన్ జరుగుతున్నప్పుడు చిన్ని కృష్ణ ఈ కథని గోదావరి బాక్ డ్రాప్ లో చెప్పారట. ఇది మార్చాలి అని పరుచూరి బ్రదర్స్ కోరడంతో.. కథ గోదావరి బాక్ డ్రాప్ నుంచి కాశీ బాక్ డ్రాప్ కి వెళ్ళింది. 

66

అంతా ఒకే అనుకున్నాక కథని చిరంజీవికి వినిపించారు. చిరంజీవి వెంటనే షూటింగ్ ప్రారంభించండి అని చెప్పారట. షూటింగ్ చివరి దశలో ఉండగా మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా డైలాగ్ ని, రాననుకున్నారా రాలేననుకున్నారా డైలాగ్ ని పరుచూరి గోపాలకృష్ణ క్రియేట్ చేశారట. ఆ డైలాగ్స్ విన్న వెంటనే చిరంజీవి కేవలం గంటలో పరుచూరి గోపాలకృష్ణకి సోనీ ఎరిక్సన్ ఫోన్ గిఫ్ట్ గా ఇచ్చారు.ఆ గిఫ్ట్ ని ఎప్పటికీ మరచిపోలేను అని పరుచూరి అన్నారు.  ఇంద్ర మూవీ రిలీజ్ అయి సరికొత్త ఇండస్ట్రీ హిట్ గా సంచలనం సృష్టించింది. 

Read more Photos on
click me!

Recommended Stories