శ్రీదేవితో రొమాన్స్ చేసిన స్టార్ డైరెక్టర్, సిట్యుయేషన్ అలా డిమాండ్ చేసింది!

First Published Oct 19, 2024, 1:31 PM IST


సాధారణంగా హీరోలు హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తారు. కానీ ఓ దర్శకుడు హీరోయిన్ శ్రీదేవితో రొమాన్స్ చేయాల్సి వచ్చింది. అది కూడా ఆఫ్ స్క్రీన్. ఇంతకీ ఏం జరిగింది?
 


 ఆ హీరో శోభన్ బాబు కాగా,  హీరోయిన్ శ్రీదేవి అట. ఆమెను ఎత్తుకోనని హీరో శోభన్ బాబు మొండిపట్టు పట్టాడట. దాంతో దర్శకుడు రాఘవేంద్రరావుకి తప్పలేదట. రోజూ శ్రీదేవిని పైకి ఎత్తుకోవాల్సి వచ్చిందట. ఈ ఇంట్రస్టింగ్ స్టోరీ మీ కోసం.. 
 


రాఘవేంద్రరావు-శ్రీదేవి కాంబోలో అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలు తెరకెక్కాయి. వాటిలో దేవత ఒకటి. శోభన్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రంలో జయప్రద, శ్రీదేవి హీరోయిన్స్. వారు అక్కాచెల్లెళ్ల పాత్రలు చేశారు. అక్క కోసం జీవితాన్ని త్యాగం చేసేదిగా శ్రీదేవి పాత్ర ఉంటుంది. లవ్, రొమాన్స్, ఎమోషన్ కలగలిపి ఈ చిత్రాన్ని దర్శకుడు కే రాఘవేంద్రరావు తెరకెక్కించారు. దేవత మూవీ శోభన్ బాబుకు మంచి బ్రేక్ ఇచ్చింది. అప్పటి వరకు ఆయన ప్లాప్స్ తో సతమతమవుతున్నట్లు సమాచారం. దర్శకుడు రాఘవేంద్రరావు దేవత చిత్రాన్ని గొప్పగా చిత్రీకరించారు. 

దేవత చిత్రానికి చక్రవర్తి సంగీతం అందించారు. ''ఎల్లువొచ్చి గోదారమ్మ'' సాంగ్ ఇప్పటికీ ఫేమస్. అక్కడక్కడా వినిపిస్తూనే ఉంటుంది. గోదావరి నది పాయల మధ్య ఉండే ఇసుకలో ఆ పాట చిత్రీకరించారు. బిందెల సెట్టింగ్ బాగుంటుంది. శ్రీదేవి గ్లామరస్ లుక్ పాటకు హైలెట్. నడుము అందాలు చూపిస్తూ శ్రీదేవి కుర్రకారును కట్టి పడేసింది. శోభన్ బాబు-శ్రీదేవి మధ్య కెమిస్ట్రీ బాగుంటుంది. 

Latest Videos



కాగా గోదావరి నదిలోని లొకేషన్ కి చేరుకోవడానికి చిన్న పాయ దాటాల్సి వచ్చేదట. శ్రీదేవి నది బయటే కాస్ట్యూమ్, మేకప్ ధరించి సిద్ధం అయ్యేదట. ఆ నీటి పాయలో దిగితే శ్రీదేవి బట్టలు తడిసిపోతాయి. రాఘవేంద్రరావు హీరో శోభన్ బాబుతో శ్రీదేవిని ఎక్కించుకుని పాయ దాటించమని అడిగాడట. అందుకు శోభన్ బాబు ఒప్పుకోలేదట. నా వల్ల కాదు. నేను శ్రీదేవిని ఎత్తుకోవడం కుదరదు అన్నాడట. 

ఇక చేసేది లేక శ్రీదేవిని రాఘవేంద్రరావు ఎత్తుకుని ఆ నీటి పాయ దాటించాడట. ఆ సాంగ్ షూటింగ్ పూర్తి అయ్యే వరకు రాఘవేంద్రరావుకి శ్రీదేవిని ఎత్తుకుని ఏరు దాటించడం విధిగా మారిందట. శోభన్ బాబు నా వల్ల కాదనడంతో శ్రీదేవితో రాఘవేంద్రరావు ఆఫ్ స్క్రీన్ రొమాన్స్ చేయాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ఓ కార్యక్రమంలో రాఘవేంద్రరావు స్వయంగా చెప్పారు. 
 


1982 లో విడుదలైన దేవత విశేష ఆదరణ దక్కించుకుంది. మోహన్ బాబు, కైకాల సత్యనారాయణ, రావు గోపాలరావు కీలక రోల్స్ చేశారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో దేవత చిత్రాన్ని నిర్మించారు. నిర్మాత రామానాయుడుకి దేవత మూవీ భారీ లాభాలు తెచ్చిపెట్టింది. సురేష్ ప్రొడక్షన్స్ ఎదగడంలో దోహదం చేసింది. 

శ్రీదేవి అనంతరం బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. ఆమె అక్కడ సక్సెస్ కావడంతో సౌత్ లో చిత్రాలు చేయడం తగ్గించింది. అదే క్రమంలో బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ని వివాహం చేసుకుంది. బోనీ కపూర్ కి శ్రీదేవితో రెండో వివాహం. శ్రీదేవి-బోనీ కపూర్ ల సంతానమే జాన్వీ కపూర్, ఖుషి కపూర్. 
 


2018లో శ్రీదేవి దుబాయ్ హోటల్ లో ప్రమాదవశాత్తు కన్నుమూసింది. మరణించే వరకు కూడా శ్రీదేవి నటిస్తూనే ఉన్నారు. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో సత్తా చాటింది. శ్రీదేవి మరణం చిత్ర పరిశ్రమను కుదుపుకు గురి చేసింది. ఇక శ్రీదేవి నట వారసులుగా జాన్వీ కపూర్, ఖుషి కపూర్ సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యారు. 

బిగ్ బాస్ హౌజ్ నుంచి ఈ వారం బయటకు వెళ్లేది ఎవరు?

Sridevi

జాన్వీ కపూర్ దఢక్ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. ఇటీవల ఆమె ఎన్టీఆర్ కి జంటగా దేవర చిత్రం చేసింది. దేవర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దేవర జాన్వీ కపూర్ కెరీర్లో అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా ఉంది. రూ. 500 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టింది. ఇక ఖుషి కపూర్ ఇప్పుడిప్పుడే పరిశ్రమలో ఎదుగుతుంది. 

click me!