‘ఆంటీ కాదు.. ఇక అలాంటి పదాలతోనే అనసూయను పిలుస్తారంటా.. వాళ్లకు బుద్ధి చెప్పండంటూ యాంకర్ రిక్వెస్ట్.!

First Published Aug 27, 2022, 3:32 PM IST

స్టార్ యాంకర్ అనసూయకు, ట్రోలర్స్ కు జరుగుతున్న ఆన్ లైన్ వార్ ఇంకా ముదురుతోంది. తాజాగా డబుల్ మీనింగ్ పదాలతో పిలవాలా? అంటూ ఓ నెటిజన్ పోస్ట్ పెట్టడం.. దానికి అనసూయ రిప్లై ఇవ్వడం వైరల్ గా మారింది.
 

స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj), ట్రోలర్స్ కు మధ్య వార్ ఏమాత్రం తగ్గడం లేదు. అనసూయ వ్యాఖ్యలపై ప్రశ్నల వర్షం కురిపిస్తుండగా.. ఇటు అనసూయ కూడా ట్రోలర్స్ పోస్టులకు స్పందిస్తూ తనను తాను సమర్థించుకునేలా ట్వీట్లు చేస్తోంది. 
 

అయితే సెన్సేషన్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) - పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘లైగర్’ డిజాస్టర్ గా నిలవడంతో..  అనసూయ చేసిన కామెంట్లు ఈ దుమారానికి దారి తీసింది. 
 

‘అమ్మని.. అన్న వారికి కర్మ ఫలం తప్పదు’ అంటూ కామెంట్స్ చేయడంతో ‘లైగర్’ ఫ్యాన్స్ అనసూయపై సోషల్ మీడియా వేదికన ట్రోల్స్, మీమ్స్ చేస్తున్నారు. అలాగే ఆమెను ‘ఆంటీ’ అంటూ.. గతంలో అనసూయ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ తెగ ట్రోల్ చేస్తున్నారు. 

అయితే తాజాగా ఓ ట్రోలర్ మాత్రం అనసూయనుద్దేశించి ఘోరమైన పోస్ట్ పెట్టాడు. ‘అనసూయ మిమ్మల్ని.. ఆంటీ అనోద్దు, అక్కా అనొద్దు, అలాగేతే ఒసేయ్, నిం...జా, సం..జా, బజార్ నిం..జా అని ఏమైనా పిలవాలా?’ అంటూ ఘోరమైన పదాలతో పోస్ట్ పెట్టారు. 

దీనిపై అనసూయ ఎమోషనల్ గా స్పందించింది. ఇలాంటి వారికి.. మీ వంతు మీరు బుద్ది చెప్పండి.. నేను చెప్పిన కర్మ.. తిరిగి వచ్చి మిమ్మల్ని, మీ ఆడవాళ్లను కూడా అవసరమైనప్పుడు కాపాడుతుంది.. చూస్తు ఉందండీ.. వీరేం చేస్తే కర్మ మీకు అదే తిరిగి ఇస్తుందని ట్వీట్ చేసింది. అటు పలువురు రోలర్స్ కూడా ‘హెల్తీగా ట్రోల్ చేయండి.. ఇలా కాదు’ అంటూ ఆ వ్యక్తికి బుద్ధి చెబుతున్నారు.
 

రోజురోజుకు అనసూయపై ట్రోల్స్ పెరుగుతుండటంతో అటు ‘లైగర్’ చిత్రంపై నెటిజన్ల ఫోకస్ తగ్గిందని, అనసూయ ఆ చిత్రాన్ని బతికిస్తోందని పలువురు అంటున్నారు. ఏదేమైనా అనసూయ - ట్రోలర్స్ మధ్య సాగే వార్ ఎప్పుడు ముగుస్తుందా అన్నది తెలియడం లేదు.

click me!